రఘురామ ఇష్యూకు తెరదించేస్తారా.. ?
అలాగే గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వం బాధితుడికి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, ఇది కాస్తా రఘురామ వర్సెస్ సునీల్ కుమార్ మధ్య వ్యక్తిగత పోరుగా మారిపోయింది. ఇదే సమయంలో రఘురామకృష్ణరాజుకు సంబంధించిన పాత ఆర్థిక లావాదేవీల కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాలు ప్రత్యర్థులకు బలమైన ఆయుధాలుగా మారాయి.
తనపై వస్తోన్న విమర్శలు, ప్రతి విమర్శలపై తనదైన శైలిలో ఘాటుగా స్పందించడం, కొన్ని సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సమస్యను మరింత జటిలం చేస్తోంది. ఆయన ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండటంతో, ఆయన చేసే ప్రతి వ్యాఖ్యను ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వానికి ఆపాదిస్తున్నాయి.
పరిశీలకుల విశ్లేషణ ప్రకారం, రఘురామ ఇష్యూ కేవలం ఆయన వ్యక్తిగత అంశంగా మిగిలిపోవడం లేదు.
ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో, ఇలాంటి వివాదాలు చర్చనీయాంశం కావడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. ఈ గందరగోళాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తోంది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి యూట్యూబ్ చానెళ్లతో గొడవ పడటం వల్ల వ్యవస్థల గౌరవం తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది.
ఈ వ్యవహారానికి వెంటనే పుల్స్టాప్ పడకపోతే ఇబ్బందులు తప్పవు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర నాయకులు జోక్యం చేసుకుని రఘురామకు తగిన సూచనలు చేయాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విమర్శలకు పోకుండా కేవలం న్యాయపరంగా ఈ కేసులను డీల్ చేసేలా చూడాలి. ఫైనల్గా రఘురామ ఇష్యూని ఎంత త్వరగా సెటిల్ చేస్తే కూటమి ప్రభుత్వానికి అంత మంచిది.