ఏపీ: మరో దారుణం.. ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్..!

Divya
గత కొద్ది రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో వరుసగా హత్యలు మానభంగాలు చిన్నారుల హత్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. అయితే ఇప్పుడు తాజాగా తిరుపతిలో ఒకే వ్యక్తి మూడు హత్యలు చేసి ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే నిన్నటి రోజున రాత్రి 7:30 గంటల సమయంలో ఈ దారుణం తిరుపతిలో పద్మావతి నగర్ లో వెలుగు చూసింది. మోహన్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారట.. కొన్ని రోజులుగా గొడవలు పడుతూ ఇంట్లో చాలా గందరగోళం సృష్టిస్తున్నారని అక్కడ ఉండే స్థానికులు తెలుపుతున్నారు.

అంతేకాకుండా తన పెళ్లి విషయంలో కక్ష పెంచుకున్న మొహం తన వదినతో తీవ్రంగా గొడవపడి మరి కత్తితో తన వదిన పీక కోసి అనంతరం ఆమె కూతుర్లను కూడా అదే విధంగా చంపి గదిలో వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారట.. ఈ విషయం అక్కడి స్థానికులు తెలిసి భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ త్రిబుల్ మర్డర్ సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారట.. దీంతో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మోహన్ పైన లోతైన దర్యాప్తు చేసిన పోలీసులు కొన్ని నిజాలు బయటపెట్టినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మొహానికి ఇష్టం లేని పెళ్లి చేసిన అన్న వదినల పైన కక్షతోనే ఇలాంటి హత్యకు పాల్పడ్డారని పోలీసుల నివేదికల తేలిందట సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా పని చేస్తున్న మోహన్ 2019లో వివాహం చేసుకున్నారు అయితే పెళ్లైన నాటి నుంచి కుటుంబంలో ఎప్పుడు గొడవలు వస్తూనే ఉన్నాయట అలా 2021 లో మోహన్ తన భార్యను వదిలేసి వెళ్లిపోయారు.. దీంతో అప్పటినుంచి మోహన్ తన అన్న వదినలతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారట. అలా తనని పట్టించుకోవడంలేదని కసిపెంచుకున్న మోహన్ నిన్నటి రోజున తిరుపతిలో పద్మావతి నగర్ లో ఉన్న తన అన్న ఇంటికి వచ్చి తన అన్న లేని సమయంలో తన వదిన ఇద్దరు బిడ్డలను కూడా మర్డర్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. ఆ తర్వాతే మోహన్ తన బెడ్ రూమ్ లోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకున్నారని పోలీసులు తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: