పాఠాలను నేర్పాల్సిన మాస్టారు .. ఇలా చేస్తే ఎలా..?

Satvika
తల్లి దండ్రుల తర్వాత అంతటి స్థానం చదువు నేర్పించే పంతులు కు ఉంటుంది.. అలాంటి మాస్టారు మంచేదో, చెడేదో చెప్పాల్సింది పోయి దేవాలయం లాంటి తరగతి గదిలోనే తన వ్యసనాలకు తలుపులు తెరిచారు. ఇలాంటి అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. పాఠశాలలో అతను చేసిన ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

విజయనగరం జిల్లాకు చెందిన కోటేశ్వరరావు కుప్పం లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ బదిలీ పై రెండు నెలల కిందటే పాకాల మండలం మొగరాల పంచాయతీ కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. విద్యార్థులను చితకబాదటం, బూతులు మాట్లాడటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారని విద్యార్థుల తల్లి దండ్రులు ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం పాఠశాల లోనే మద్యం సీీసా ముందు పెట్టుకొని బిరియానీతో దర్శనమిచ్చారు. బడి లో పిల్లలు ఒకవైపు చూస్తున్నా కూడా ఏమీ ఎరగనట్లు తన పని తాను చేసుకోవడం చేస్తున్నాడు. పాఠాలు చెప్పమని పిల్లలు అడిగిన వారిని చితక బాదేవాడు..

పాఠశాలలో ఎంటి నీ పాడు పని, పిల్లలకు ఇదేనా నువ్వు నేర్పేది అంటూ విద్యార్థుల తల్లి దండ్రులు నిలదీశారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వీడియో తీస్తున్నా పట్టించుకోకుండా మద్యం సీీసా చూపుతూ..దుస్తులు కూడా తీయాలా అంటూ వెక్కిరిస్తూ మాట్లాడారు. ఉపాధ్యాయుడు ప్రవర్తన పై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అతని పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీనిపై పాకాల ఎంఈవో బాబ్జీని వివరణ కోరగా.. విషయం తన దృష్టికి రావడంతో మెమో ఇచ్చామన్నారు. డీఈఓ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుడిని విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి ప్రబుద్ధులు ఉంటే పిల్లల భవిష్యత్ నాశనం అవుతుందని , అధికారులు చేసిన పని వల్ల అయిన అతనికి బుద్ది వస్తుందేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: