పాకిస్థాన్ లో సిక్కు గురుద్వారా చూడాలని ఉంది
ప్రత్యేకత ఏమిటి?
పాకిస్తాన్ లో ఉన్న ఏకైక భారత గురుద్వారా ఇదే ప్రత్యేకత. విభజన కాలంలో ఈ ప్రాంతం పాక్ భూభాగంలో కలిసి పోయింది. దీంతో ఈ గురుద్వారా కి సిక్కులు అతి కష్టం మీద రాకపోకలను సాగించేవారు.. పాకిస్థాన్ లో ఉన్నా కూడా భారతీయ సిక్కులు ఈ కర్తార్పూర్ సాహిబ్ కి రావడం వెనక ముఖ్య కారణం ఏంటంటే సిక్కు మత గురువు అయిన గురునానక్ ఇక్కడే తన జీవితంలోని చివరి 18 ఏళ్ళు గడిపారు. మరియు ఈ ప్రాంతంలోనే పరమపదించారు. అందుకే భారత సిక్కులు ఈ ప్రాంతాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు . ఇదొక్కటి చాలు కదా ఇంకేమీ ప్రత్యేకతలు కావాలి....
కారిడార్ నిర్మాణం :
ఎలా చేరుకోవాలి?
ప్రతి భారతీయ సిక్కు పాకిస్తాన్ లో ఉన్న కర్తార్పూర్ సాహిబ్ దర్శించాలని అనుకుంటారు.. ఈ కర్తార్ పూర్ కి చేరుకోవాలంటే ముందుగా పంజాబ్లోని గురుదాస్పూర్ నుండి నాలుగు కిలోమీటర్లు ప్రయాణించాలి.. అలా ప్రయాణించాక అంతర్జాతీయ సరిహద్దు వస్తుంది ఆ సరిహద్దు గుండా పాకిస్తాన్ లోకి అడుగు పెడతారు. ఆ తర్వాత పాక్ భూభాగం లో నుండి మరో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే కర్తార్పూర్ సాహిబ్ కి చేరుకుంటారు . మీరు ప్రయాణించడం కోసం అక్కడ బస్సు సౌకర్యాలు ఉంటాయి. దాంతో మీరు సులువుగా పాకిస్తాన్ భూభాగంలోకి అడుగు పెట్టవచ్చు..జాగ్రత్త పాస్ పోర్ట్ నీ వెంట తీసుకు వెళ్ళండి. సాహిబ్ లోకి ప్రవేశించాక అక్కడి సూచనలను పాటించండి. వీలైతే పాకిస్తాన్ కరెన్సీ తో అక్కడి మార్కెట్లో షాపింగ్ చేయండి . అక్కడ ఉన్న వాళ్లతో మాట్లాడండి. మళ్ళీ క్షేమంగా ఇండియాకి వచ్చేయండి...