కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టేశారా?
కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం ఒకే వ్యక్తికి ఒకే పదవి ఉండాలి. కానీ లోక్ సభ ఎన్నికలకు తక్కువ సమయం ఉండటం.. రేవంత్ నేతృత్వంలో అధికారంలోకి రావడంతో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు ఆయన్నే పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయించింది. ఇప్పుడు పోలింగ్ ముగిసింది. అందరూ జూన్ 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా పీసీసీ పదవి కోసం పైరవీలు ప్రారంభం అయ్యాయి.