వైరల్ : సీఎం చేసిన పనికి.. నవ్వుకుంటున్న నెటిజెన్స్?

praveen
సాధారణంగా రాజకీయ నాయకులకు సంబంధించిన వార్తలు ఏవైనా సోషల్ మీడియాలో కి వచ్చాయి అంటే చాలు అవి తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన పనికి ప్రస్తుతం నెటిజన్లు అందరూ కూడా పగలబడి నవ్వుకుంటారు అని చెప్పాలి. అదేంటి ముఖ్యమంత్రి అన్న తర్వాత అన్నీ ఆలోచించే చేస్తారు.. నెటిజన్లు పగలబడి నవ్వుకునేలా ఆయన ఏం చేశారు అని అనుకున్నాను కదా.

 గుడిలో పూజ చేశారు.. పూజలు చేస్తే తప్పేంటి అనే కదా మీ డౌట్.. అయితే గుడిలో పూజ చేసిన సమయంలో తీర్థప్రసాదాలు తీసుకుంటారు అనే విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఆయనకు స్పెషల్గా తీర్థప్రసాదాలు తయారుచేసి ఇస్తారు ఆలయ నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఇటీవలే పూజలు చేసిన అనంతరం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా తీర్థం తీసుకున్నారు. అయితే ఆయన తీర్ధం తీసుకుని తాగడం చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

 దేవుడు తీర్థం  తాగడం లో తప్పేముంది అందులో నవ్వు కోవడానికి ఏముంది అని అనుకుంటున్నారు కదా.. తీర్ధం తాగే ముందు మాస్క్ పెట్టుకున్నా విషయాన్ని మరిచిపోయి అలాగే తాగడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారి పోయింది అని చెప్పాలి. కరోనా కాలం  లో రాజకీయ నాయకులు అందరూ ఎక్కడికి వెళ్లినా నిత్యం మాస్కులు వేసుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే జైసల్మేర్ లోని రాందేవ్రా లో పర్యటించిన అశోక్ గెహ్లాట్ అక్కడ లోక దేవత బాబా రాందేవ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. కాగా పూజారులు ఆయనకు తీర్థం అందించగా ఆయన మాస్క్ తీయకుండానే తాగేశారు. ఇది చూసి అందరూ అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: