వైరల్ : ఎద్దుకు ప్రస్టేషన్ వస్తే.. ఇలాగే ఉంటుంది మరి?

praveen
సాధారణంగా భారీ ఆకారంతో ఉండే జంతువులు కాస్త కోపం వచ్చినప్పుడు ఎంత విధ్వంసం సృష్టిస్తాయో   ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకు ఎన్నో సార్లు చిర్రెత్తుకొచ్చిన ఏనుగులు సృష్టించిన విధ్వంసం కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వైరల్ గా మారిపోయాయి. జనాల పై దాడి చేయడమే కాదు పంటనష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి ఏనుగులు. కొన్ని కొన్ని సార్లు సాధు జంతువులు గా కనిపించే ఎద్దుల సైతం కోపంతో ఊగిపోతూ ఎంతో మంది జనాలు పై దాడిచేసి గాయపరిచటం లాంటివి కూడా వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో చిరుత పులులు లాంటి జంతువులు కూడా ఏకంగా అడవుల్లో నుండి జనావాసాల్లోకి వచ్చి దాడి చేయడం లాంటివి జరుగుతున్నాయి.

 ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. విపరీతమైన కోపంతో ఊగిపోయిన ఒక ఎద్దు దారుణంగా విధ్వంసం సృష్టించింది. ఆ ఎద్దు చేసిన రచ్చకి స్థానికులు అందరూ ప్రాణభయంతో ఊగిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పెరు దేశంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. లిమ అనే ప్రాంతంలోని రోడ్డు పక్కన దుకాణాలు ఉన్నాయి. అయితే అక్కడికి  కోపంతో ఒక ఎద్దు దూసుకొచ్చింది. అయితే ఎద్దు దూసుకు రావడాన్ని గమనించిన అందరూ కూడా పక్కకు తప్పుకున్నారు. ఆ ఎద్దు వచ్చీ రావడమే ఒక టేబుల్ ను కొమ్ములతో పక్కకు పడేసింది.


 అంతటితో ఆగకుండా అక్కడున్న బోర్డులను కిందపడేసి దారుణంగా చింపేసింది. ఇక చివరకు షాప్ లోకి దూరి అక్కడ విధ్వంసం సృష్టించింది. షాప్ లో ఉన్న కుర్చీలు లాప్టాప్లు మరిన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా తన కొమ్ములతో చిందరవందరగా చేసి పగలగొట్టింది. ఇక అప్పటికి కోపం తగ్గకపోవటంతో ఆ ఎద్దు షాప్ నుంచి పక్కనే ఉన్న దుకాణం లోకి దూసుకు వెళ్ళింది. ఇక అక్కడ ఉన్న వస్తువులు అన్నింటిని కూడా ధ్వంసం చేసింది అని చెప్పాలి. అయితే ఇందుకు సంబంధించిన వీడియో సిసిటివి ఫుటేజీలో రికార్డు కావడంతో వైరల్ గా మారిపోయింది. ఘటన సమయంలో అందరూ అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: