ఇక మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ నేరాలు అనేవి అసలు చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇంటర్ వినియోగం భారీగా పెరుగుతోన్న భారత్లాంటి దేశాల్లో అయితే ఈ నేరాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటోంది.ఇక గడిచిన మూడేళ్లలో కనుక చూసినట్లయితే భారత దేశంలో ఏకంగా మొత్తం 36.29 లక్షల సైబర్ సెక్యూరిటీ ఘటనలు నమోదయ్యాంటే పరిస్థితులు అనేవి అసలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపడం జరిగింది.ఇంకా అలాగే లోక్సభలో అడిగిన ఓ అప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వక సమాధానం కూడా ఇవ్వడం జరిగింది.ఇంకా అలాగే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అందించిన నివేదిక ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే..2019 వ సంవత్సరంలో మొత్తం 3,94,499 కేసులు ఇంకా అలాగే 2020 వ సంవత్సరంలో 11,58,208, 2021 వ సంవత్సరంలో 14,02,809, 2022 వ సంవత్సరంలో ఇప్పటివరకు కూడా మొత్తం 6,74,021 కేసులు నమోదైనట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇక దేశంలో పెరిగిపోతున్న ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపడుతోందన్న మంత్రి..ఈ సైబర్ భద్రతా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సైబర్ దాడులను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలిపారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా యూజర్లకు సలహాలు ఇవ్వడం ఇంకా అలాగే సైబర్ మోసాలకు సంబంధించి తగిన హెచ్చరికలను ముందుగానే రూపొందించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు మంత్రి వివరించడం జరిగింది.కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. సైబర్ నేరాలకు చిక్కకుండా జాగ్రత్తగా ఉండండి.మీ బ్యాంకు డీటెయిల్స్, ఆధార్ డీటెయిల్స్ అనేవి కేవలం మీరు పని చేసే ఆఫీస్ అధికారులకి తప్ప ఎవరికీ ఇవ్వకండి. మరీ ముఖ్యంగా మీ ఫోన్ లలో కొన్ని లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ పై పొరపాటున కూడా క్లిక్ చెయ్యకండి.