టీవీ: పల్లవి ప్రశాంత్ నిజ స్వరూపాన్ని బయటపెట్టిన నటి షకీలా..!

Divya
బిగ్ బాస్ కథ సీజన్లో  కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఏకంగా టైటిల్ విన్నర్ ని గెలుచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంత పాపులారిటీ సంపాదించుకున్న పల్లవి ప్రశాంత్ గురించి తాజాగా నటీ బిగ్ బాస్ కంటెస్టెంట్ షకీలా పలు విషయాలను తెలియజేసింది వాటి గురించి చూద్దాం.

ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షకీలా తాను హౌస్ లో ఉన్నప్పుడు ప్రియాంక, అమర్ , సందీప్ మాస్టర్ ,దామిని ఈ నలుగురు మాత్రమే చాలా మంచిగా కనిపించారని తెలిపింది. వీరందరిలో నిజాయితీ కనిపించింది అని ఇక శివాజీ న్యూట్రల్ గా ఉండేవారని తెలియజేసింది. అయితే పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ పైకి కనిపించే అంత మంచివాడు కాదని కూడా తెలియజేసింది.. హౌస్ లో ఉన్నప్పుడు పిల్లి లాగా ఉన్న పాపులారిటీ వచ్చేసరికి తన యాటిట్యూడ్ చూపిస్తూ ముందుకు వెళ్తూ ఉండేవారని షకీలా తెలిపింది. అలాగే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నా కూడా వారిని లెక్కచేయకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవారని తనకంటే పెద్దవారిని ఎప్పుడూ కూడా గౌరవించకుండా కాస్త పొగరుగానే మాట్లాడే వారిని తెలియజేసింది షకీలా.

బిగ్ బాస్ కార్యక్రమం వల్ల తనకు వచ్చిన లాభం ఏమీ లేదు అని కేవలం పేమెంట్స్ మాత్రమే ఇచ్చారు.. పాపులారిటీ కోసమే తనని హౌస్ లోకి తీసుకున్నారు వారి అవసరం తీరిపోయాక తనని కూడా బయటికి పంపించారని తెలియజేసింది. ఈ కార్యక్రమం వల్ల ఎవరికి లాభం అంటే కేవలం నాగార్జున కు మాత్రమే లాభమని ఎందుకంటే స్టూడియో ఆయనదే హోస్టు కూడా ఆయనే కనుక నాగార్జునకు తప్ప ఎవరికీ ఎలాంటి లాభం ఉండదు అంటూ షకీలా తెలియజేయడం ఒక సంచలనంగా మారింది. గతంలో బోల్డ్ సినిమాలలో నటించిన షకీలా ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా సినిమాలలో పెద్దగా కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: