TV: లైఫ్ లో ఆ కష్టాలు మరువలేని.. సీరియల్ నటి మాహి గౌతమి..!

Divya
వెండితెరపై నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఎంతోమంది నటీనటుల జీవిత గాధలు ఒక్కొక్కరిది ఒక్కో వ్యధ.. తెరపై నవ్వుతూ నవ్విస్తూ ఎంతోమంది అభిమానుల మనసులు దోచుకున్న చాలామంది తెరవెనుక తమ పడిన కష్టాలను ఒక్కొక్కటిగా సమయం వచ్చినప్పుడు తెలియజేస్తూ ఉంటే నిజంగా వీరి జీవితంలో ఇన్ని కష్టాలు పడ్డారా అన్న అనుమానం కలుగుతుంది.. మరీ ముఖ్యంగా బుల్లితెర ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరాల తరబడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఈ బుల్లితెర నటీనటుల జీవిత కథలు వింటే మాత్రం తప్పకుండా కన్నీళ్లు వస్తాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సీరియల్ నటి మాహి గౌతమి కూడా తన జీవితంలో ఎదుర్కొన్న చేదు ఘటనల గురించి మీడియా ముందు వెల్లడించింది.
రంగులరాట్నం,  చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి వంటి సీరియల్స్ లో హీరోయిన్గా నటిస్తున్న మాహి గౌతమి అచ్చ తెలుగు అమ్మాయి. పుట్టి పెరిగింది అంతా హైదరాబాదులోనే.. తెలంగాణకు చెందిన ఈమె మొదటిగా వనిత ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించి..  ఆ తర్వాత రేడియో జాకీగా ఒక రేడియో ఛానల్లో కూడా పనిచేసింది.. అలా రేడియో జాకీగా కెరియర్ను కొనసాగించిన ఈమెకు సీరియల్స్ అంటే చాలా ఇష్టమట.. అందుకే తాను మొదట సీరియల్స్ లోకి అడుగు పెట్టాలని అనుకోకుండానే అడుగు పెట్టినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించండి. ఇకపోతే తాను ఈ స్టేజ్ కి రావడం వెనుక తాను పడిన కష్టాల గురించి ఎమోషనల్ అయింది.
ఇకపోతే ప్రతి సందర్భంలో కూడా తన తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని.. ప్రస్తుతం నటిస్తున్న రంగుల రాట్నం,  చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్స్ రెండిట్లో కూడా తన క్యారెక్టర్ తనకు బాగా నచ్చింది అని బయటకు వెళ్తే చాలామంది లక్ష్మి ,  మహాలక్ష్మి అంటూ పిలుస్తున్నారు అని కొంతమంది పెద్దవాళ్లు తనను పట్టుకుని ఏడ్చేస్తున్నారు.. ఇన్ని కష్టాలు పడుతున్నావు అంటూ బాధపడుతున్నారని చెప్పుకొచ్చింది మాహీ గౌతమీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: