టీవీ : ఆ కొరియోగ్రాఫర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?

Divya

ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ డాన్స్ ప్రోగ్రాం చాలామంది కంటెంట్స్ కి లైఫ్ ఇచ్చింది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రోగ్రాం ద్వారా ఈటీవీ చాలా పాపులారీటీ ని సంపాదించిందని చెప్పవచ్చు. అయితే అందులో ఒక స్టైల్ గా కనిపించే కంటెస్టెంట్  గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.
అంత స్టైల్ గా కనిపించే కంటెస్టెంట్  ఎవరంటే "యశ్వంత్ మాస్టర్" అని చెప్పవచ్చు. ఈయన పూర్తి పేరు యాడారల్ యశ్వంత్. ఈ మాస్టర్ అనంతపూర్ జిల్లాలోని గుత్తి పట్టణంలో 1991 జూన్ 5 న జన్మించారు . ఇతడి ప్రస్తుత వయస్సు  30 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఇతని తండ్రి ఓ ఆయుర్వేద డాక్టర్, ఇతని తల్లి ఒక గృహిణి. యశ్వంత్  విద్యాభ్యాసం అనంతపూర్ జిల్లా లోని రవీంద్ర భారతి స్కూల్ లో 9 తరగతి వరకు చదివారు. ఆ తర్వాత వీరి ఫ్యామిలీ అంతా కర్ణాటకకు వెళ్లిపోవడంతో అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఇతను NITT కళాశాలలో ఎంబీఏ పూర్తి చేశాడు.

యశ్వంత్ కి తన చిన్నప్పటి నుంచే డ్యాన్స్ అంటే చాలా ఇష్టమట. ఆ ఇష్టమే స్కూల్లో,కాలేజీలో ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు అతడి పేరు ముందు వరుసలో ఉంటుంది. స్టేజీల మీద చేసిన డాన్స్ వీడియోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడంతో..ఢీ డాన్స్ షో నుంచి పిలుపు వచ్చింది. అలా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటూ  వచ్చి, డాన్స్ ప్లస్ షోకి జడ్జిగా వెళ్ళాడు.
ఇక యశ్వంత్ 2019 ఏప్రిల్ 27న వర్ష భవాని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ యంగ్ కొరియోగ్రాఫర్ ఒక్కొక్క సాంగ్ కు 70 వేల రూపాయల వరకు తీసుకుంటాడు. ఇక సమంత నటించిన యూటర్న్ సినిమా కు కొరియోగ్రాఫర్ గా చేసినందుకు 2.5 లక్షలు రూపాయలు తీసుకున్నాడు. ఈయనకి జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమట. ఇక తన ఫేవరెట్ హీరోయిన్ సమంత. ఇప్పుడు తన దగ్గర ఉన్న మొత్తం ఆస్తి విలువ రెండున్నర కోట్ల రూపాయలు. అంతేకాదు హైదరాబాదులోని సాయి కృప అపార్ట్మెంట్ లోని B బ్లాక్ లో ఉంటున్నారు. ఇతడికి ఒక ఖరీదైనా స్కోడా రాపిడ్ కారు తో పాటు ఒక ఖరీదైన బైక్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: