బి బి 4: ఇంటి సభ్యుల పై కీలక వ్యాఖ్యలు చేసిన సింగర్ గీతా మాధురి...!
బయట నుండి ఎవరినీ హౌస్ లోకి నేరుగా పంపలేదు... అయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి వారానికి చేరుకున్న సందర్భంగా సీజన్ ఫోర్ ఇంటి సభ్యులకు స్క్రీన్ పై నలుగురు సెలబ్రిటీలు కనిపించి సందడి చేశారు. వారెవరో కాదు బిగ్ బాస్ గత సీజన్లో పాల్గొన్న గీత మాధురి, అలీ, హరితేజ మరియు శ్రీముఖి. హౌస్ లో లివింగ్ రూమ్లో స్క్రీన్ ముందు కూర్చున్న ఇంటి సభ్యులకు తెరపై కనిపించి సర్ప్రైజ్ ఇచ్చారు. సీజన్ ఫోర్ లో ఇంటి సభ్యుల మధ్య ఇప్పటివరకు జరిగిన కొన్ని ముఖ్యాంశాలు గురించి మాట్లాడుతూ అల్లరి చేశారు.
హరితేజ మాట్లాడుతూ మనకైతే మన వాళ్ళు వచ్చి మనకి బూస్టప్ ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే మా ఆయన వచ్చినప్పుడు నేను... నందు గారు వచ్చినప్పుడు గీతా మాధురి.. అలా రొమాంటిక్ మూడ్లోకి వెళ్ళాం కానీ సీజన్ ఫోర్ లో ఇంటి సభ్యులకు ఆ ఛాన్స్ లేదు అంటుండగా.... ఇంతలో గీతా మాధురి ఆ మాటను అందుకని.. అందుకే కదమ్మా వాళ్ల ఇంట్లోనే రొమాన్స్ మొదలు పెట్టారు అంటూ ఫన్నీ గా మాట్లాడింది. అవును నిజమే అంటూ శ్రీముఖి అల్లరి చేసింది. గీతా మాధురి అలా డైరెక్ట్ గా కంటెస్టెంట్ లు రొమాన్స్ ఇంట్లోనే చేస్తున్నారుగా అనడం వైరల్ గా మారింది. నిజమేగా ఇప్పటివరకు మనం అనుకున్నాం ఇప్పుడు గీతా మాధురి కూడా అదే అన్నారు అంటున్నారు నెటిజన్లు.
ఆ తర్వాత టాప్ ఫైవ్ కి చేరుకున్న ఇంటి సభ్యులు.... గెస్ట్ లను మేము ఇంట్లో నడుచుకుంటున్న విధానంలో చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అంటూ అడిగారు. దానికి శ్రీముఖి, హరితేజ, అలీ, గీతా మాధురి అందరూ కలిసి ఏక కంఠంతో జరిగేది జరుగుతుంది.... మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది ఆల్రెడీ చూపించే ఇంత వరకు వచ్చారు... ఇక ఎంజాయ్ చెయ్యండి... ఎలా ఉన్నారో అలాగే ఉండండి చాలు అంటూ సజెస్ట్ చేశారు. ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుంటూ సందడి చేసి ఆఖరికి ఇంటి సభ్యులకు బాయ్ చెప్పేసారు.