అనుకున్నదే జరిగింది.. హార్దిక్ పాండ్యా షాకింగ్ డెసిషన్?

praveen
గతకొంతకాలం నుంచి టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గతంలో గాయం బారిన పడి ఇక భారత జట్టుకు దూరమైన నేరుగా ఐపిఎల్ లో పాల్గొన్నాడు. అయితే గుజరాత్ టైటన్స్ కెప్టెన్సీ వదిలేసి ముంబై ఇండియన్స్ లోకి వచ్చిన హార్దిక్.  ఇక ముంబై కెప్టెన్సీ దక్కించుకున్నాడు. అయితే ముంబై కెప్టెన్గా హార్దిక్ బాధ్యతలు చేపట్టడంతో ఎంతోమంది ఆ జట్టు అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు  హార్దిక్ కోసం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 దీంతో హార్దిక్ పాండ్యాని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక హార్దిక్ ఐపీఎల్లో చెత్త ప్రదర్శన చేయడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయ్ అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా హార్దిక్ వార్తలో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఏకంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నటాషా తో హార్దిక్ విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ వార్త తెరమీదికి వచ్చింది. ఎందుకంటే నటాషా ఏకంగా తన ఇంస్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలు అన్నింటినీ కూడా డిలీట్ చేసింది. దీంతో హార్దిక్, నటాషా విడాకుల అంశం తెరమీదకి వచ్చింది. అయితే ఇన్నాళ్లు ఇది కేవలం ఒక పుకారు గానే మాత్రమే అందరూ అనుకున్నారు. కానీ వరల్డ్ కప్ విన్నింగ్ సమయంలో అటు నటాషా హార్దిక్ ను కలవడానికి రాకపోవడం.. కొడుకు అగస్త్య ఒక్కడే ఇక మైదానాలు కనిపించడంతో విడాకులు నిజమే అన్న విషయంపై అందరూ కన్ఫ్యూజన్లో పడిపోయారు.

 ఇటీవల ఈ విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది  భారత క్రికెటర్ హార్థిక్ పాండ్యా తన భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా నటాషాలు ఇద్దరు కూడా పోస్టులు పెట్టారు. మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇది మాకు కఠినమైన నిర్ణయం. మా కుమారుడికి మంచి కో పేరెంట్స్ గా ఉంటాము. కష్ట సమయంలో మా గోప్యతను  మీరు గౌరవిస్తూ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటూ హార్దిక్ పాండ్యా, నటాషా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా వీళ్ళు 2020 మే 31వ తేదీన వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారి దాంపత్య బంధానికి స్వస్తి పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: