ఈరోజు టీమిండియాలోకి.. అరంగేట్రం చేయబోయే ఆటగాళ్ళు వీళ్లే?

praveen
టీమిండియా లో కొత్త ప్రతిభకు కొదవలేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఎంతో మంది ఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకొని.. భారత అంతర్జాతీయ జట్టులోకి రావాలని తెగ ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే నేటి రోజుల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న యువ ఆటగాళ్ల సంఖ్య రోజు రోజుకు పెరిగి పోతుంది. తమ సత్తా ఏంటో నిరూపించుకొని భారత జట్టుకు తామే ఫ్యూచర్ స్టార్స్ అని ఎంతో మంది అర్థమయ్యేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 కొంతమంది దేశవాళి క్రికెట్లో రాణించి ఇలా గుర్తింపును సంపాదించుకుంటే.. కొంతమంది ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఛాన్సులు దక్కించుకుంటూ అదరగొడుతున్నారు. అయితే గత ఐపీఎల్ సీజన్లో కూడా ఇలాగే ఎంతో మంది ప్లేయర్లు సూపర్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. దీంతో వారికి టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కి అవకాశం ఉందని అందరూ అనుకుంటూ ఉండగా.. ఇటీవల జింబాబ్వే పర్యటనలో చాలామంది ఆటగాళ్లు టీమిండియాలోకి అరంగేట్రం చేసేందుకు సెలెక్ట్ అయ్యారు. కాగా టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లి అక్కడ టి20 సిరీస్ ఆడబోతుంది.

 ఈ జట్టులో పూర్తిగా యువ ఆటగాళ్లే ఉండగా.. ఇక భారత యంగ్ ఓపెనర్ గిల్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు అని చెప్పాలి. కాగా నేడు జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ జరగబోతుంది. అయితే నేడు జరగబోయే తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయనున్నాడు. ఇతనితో పాటు రియాన్ పరాజ్, ద్రువ్ జూరల్, సాయి సుదర్శన్, తుషార్ దేశ్ పాండే, హర్షిత్ రానా కూడా తమ తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్ ఆడబోతున్నారు. కాగా ఈ టి20 సిరీస్ లోని మ్యాచ్ లు అన్నీ కూడా హారారే వేదికగా జరగబోతున్నాయి. మరి గిల్ తన కెప్టెన్సీ తో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: