రేపు సెంచరీ నమోదు కాకపోతే.. అది కూడా రికార్డే?
అయితే ఈ వరల్డ్ కప్ సీజన్లో ఎంతో మంది ఆటగాళ్లు తమ బ్యాటింగ్ తో అదరగొట్టేసారు. సాధారణంగా టి20 ఫార్మాట్ అంటేనే భారీ స్కోరులకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది. ఇక ఎంతోమంది బ్యాట్స్మెన్లు విధ్వంసం సృష్టిస్తూ బౌలర్లతో చెడుగుడు ఆడేస్తూ ఉంటారు. కానీ ఈ టి20 వరల్డ్ కప్ లో పెద్దగా బ్యాట్స్మెన్ల ఆటలు సాగలేదు. స్లో పిచ్లపై అటు పరుగులు చేసేందుకు ఎంతగానో కష్టపడి పోయారు అని చెప్పాలి. దీంతో ఇప్పుడు ఈ వరల్డ్ కప్ పోరు ఫైనల్ వరకు చేరుకున్నప్పటికీ ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. ఎంతోమంది ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేశారు తప్ప.. ఆ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో మాత్రం ఇబ్బంది పడ్డారు.
అయితే ఈ ఏడాది 2024 వరల్డ్ కప్ ఎడిషన్ లో కేవలం ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రేపు సౌత్ ఆఫ్రికా, టీమిండియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అయితే రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై మ్యాచ్లో 90లోకి వచ్చిన శతకం మాత్రం చేర్చారుచుకున్నాడు. ఒకవేళ ఫైనల్ లో ఏ ఆటగాడు సెంచరీ కొట్టకపోతే.. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే ఒక శతకం లేని రెండో పర్యాయం అవుతుంది అని చెప్పాలి. ఎందుకంటే 2009లో టి20 వరల్డ్ కప్ లో కూడా ఏ ఒక్క ఆటగాడు సెంచరీ చేయలేకపోయారు. ఇక రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో కూడా ఒక్కరు కూడా సెంచరీ చేయకపోతే మరోసారి ఇదే రికార్డు రిపీట్ అవుతుంది అని చెప్పాలి.