103 ఏళ్ళ అభిమానికి.. మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన ధోని?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా క్రికెటర్ల లాగా ధోని అటు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు. కానీ ధోని గురించి ఏదో ఒక వార్త ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూనే ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోయినప్పటికీ అభిమానులకు మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటాడు. అందుకే ప్రజెంట్ క్రికెటర్లతో పోల్చి చూస్తే మాజీ క్రికెటర్ అయినప్పటికీ ధోనికే కాస్త ఎక్కువగా క్రేజ్ ఉంటుంది అని చెప్పాలి.
 చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా ధోనిని ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. అయితే ఇక ధోని కూడా అభిమానులు అందరితో ఎప్పుడూ ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే 2024 ఐపీఎల్ సీజన్ మహేంద్ర సింగ్ ధోనీకి చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపద్యంలో.. ఇక దేశంలో ఎక్కడ ఐపిఎల్ మ్యాచ్ ఆడేందుకు ధోని వెళ్లిన అభిమానులు అందరూ కూడా ధోనీకి నిరాజనం పలుకుతున్నారు. తమ అభిమాన క్రికెటర్ ను చూసేందుకు చాలామంది ఫ్యాన్స్ స్టేడియం  వస్తున్నారు అని చెప్పాలి. చెన్నైకి చెందిన 13 ఏళ్ల ఎం. రాందాస్ అనే ధోని అభిమాని ఏకంగా స్వయంగా స్టేడియంకు వచ్చి మ్యాచ్లు చూస్తూ ఉన్నాడు.

 ఈ విషయం తెలుసుకున్న మహేంద్ర సింగ్ ధోని ఇటీవల ఆ అభిమానిని కలిశాడు. ఈ క్రమంలోనే తన అభిమాని అయిన రాందాస్ కు ధోని ఒక మరచిపోలేని బహుమతిని ఇచ్చాడు అని చెప్పాలి. తన జెర్సీనితో పాటు దానిపై ఆటోగ్రాఫ్ చేసి  ఇచ్చాడు. మహేంద్రసింగ్ ధోని. దీంతో ఇక అభిమాన క్రికెటర్ నుంచి ఇలాంటి బహుమతి వస్తుందని కలలో కూడా ఊహించని రాందాస్.. ఆ బహుమతితో తెగ మురిసిపోయాడు అని చెప్పాలి. తనకు క్రికెట్ ఆడాలంటే చిన్నప్పటి నుంచే భయం అని రాందాస్ చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఇక ధోని ఆటను ఎంతో ఆస్వాదించే వాడినని అంటూ తెలిపాడు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: