ఆ ఇద్దరికీ టీమ్ ఇండియా నుండి పిలుపచ్చేనా..?

Pulgam Srinivas
ఒకప్పుడు ఇండియన్ క్రికెట్ టీం కు ఆడాలి అంటే భారీ సెలక్షన్ లు జరుగుతూ ఉండేవి. దాని వల్ల కొంత మంది కి ప్రతిభ ఉన్నప్పటికీ అవకాశాలు రాకపోయేవి. కానీ "ఐ పీ ఎల్" ఎప్పుడు అయితే ప్రారంభం అయ్యిందో అప్పటి నుండి ఆటగాళ్లకు ఇండియన్ క్రికెట్ టీం లో ఆడే అవకాశాలు భారీగా లభిస్తున్నాయి. (ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడిన ప్లేయర్ లు అత్యున్నత ప్రదర్శనను కనబరిచినట్లు అయితే సెలెక్టర్లు కూడా నేరుగా వారిని ఇండియా టీం లోకి తీసుకుంటున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది ఆటగాళ్లు "ఐ పీ ఎల్" లో అద్భుతమైన ప్రదర్శనను కనబరుచుకొని సెలెక్టర్ ల దృష్టిని ఆకర్షించి ఇండియన్ టీం లో ఆడి ప్రస్తుతం టీమిండియాలో అత్యున్నత స్థాయిలో కొనసాగుతున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే "ఐ పి ఎల్" 2024 ప్రారంభమైన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ లో కూడా ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తున్నారు.

వారు ఎవరో కాదు LSG టీమ్ లో ప్రస్తుతం ఆడుతున్న మయాంక్ యాదవ్ అలాగే రాజస్థాన్ రాయల్స్ లో ప్రస్తుతం ఆడుతున్న రియన్ పరగ్. మయాంక్ యాదవ్ ఇప్పటికే తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తూ ఉంటే ... రియాన్ పరాగ్ తన బ్యాట్ తో అద్భుతమైన స్కోరును సాధిస్తూ మంచి బ్యాటర్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఇక వీరిద్దరి ఆట తీరును చూస్తున్న జనాలు కచ్చితంగా వీరిని ఇండియన్ క్రికెట్ టీం లో సెలెక్ట్ చేస్తారు. మరి కొన్ని రోజుల్లోనే వీరికి ఇండియన్ క్రికెట్ టీం నుండి పిలుపు అందుతుంది అని భావిస్తున్నారు. వీరిని టీ 20 వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేయాలి అనే ఆలోచనలో ఇండియన్ క్రికెట్ టీం సెలెక్టర్స్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: