ఈ ఐపీఎల్ సీజన్.. కోహ్లీకి డూ ఆర్ డై కాబోతుందా?
ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ లేని టీమ్ ఇండియా జట్టును అటు భారత అభిమానులు అస్సలు ఊహించుకోలేరు. కానీ గత కొన్ని రోజుల నుంచి కోహ్లీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో అటు విరాట్ కోహ్లీబి బిసిసిఐ పెద్దలు పక్కన పెట్టబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. యూఎస్ఏ లో ఉండే స్లో పిచ్ లు విరాట్ కోహ్లీకి సెట్ కావనీ.. అందుకే అతన్ని పక్కన పెట్టేందుకు బీసీసీఐ సెలెక్టర్లు సిద్ధమయ్యారని.. ఈ విషయంలో కోహ్లీని ఒప్పించే బాధ్యతను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తీసుకున్నాడు అంటూ వార్తలు తెరమీదకి వచ్చాయి.
దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. అయితే ఇలాంటి వార్తల నేపథంలో విరాట్ కోహ్లీకి ఈ ఏడాది మార్చి 22వ తేదీన ప్రారంభం కాబోయే ఐపీఎల్ ఎంతో కీలకంగా కానుంది అని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే టి20 వరల్డ్ కప్ లో కోహ్లీని పక్కన పెట్టాలనుకుంటున్నారు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇక ఐపీఎల్ లో కోహ్లీ సత్తా చాటితే తప్పని పరిస్థితుల్లో సెలెక్టర్లు వరల్డ్ కప్ లోకి అతని తీసుకోవాల్సిందే. అందుకే ఈ ఏడాది ఐపిఎల్ లో ఆర్సిబి కప్పు గెలిచిన లేకపోయిన విరాట్ కోహ్లీ మాత్రం భారీగా పరుగులు చేయాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.