టీమిండియా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోహ్లీ వచ్చేస్తున్నాడు?

praveen
ప్రస్తుతం భారత జట్టు సౌత్ఆఫ్రికా పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్ లలో కూడా సిరీస్ లు ఆడుతుంది  ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఆడాల్సిన సిరీస్లను ముగించుకుంది టీం ఇండియా. ఇక డిసెంబర్ 26వ తేదీ నుంచి కూడా రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది అని చెప్పాలి. అయితే ఈ సిరీస్ కి ముందు అటు భారత జట్టుకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. ఎందుకంటే జట్టు లో ఉన్న స్టార్ ప్లేయర్లందరూ కూడా గాయాల బారిన పడి దూరమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇక స్టార్ బౌలర్గా కొనసాగుతున్న షమి.. చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఇక ఈ టెస్ట్ సిరీస్ కి దూరమయ్యాడు.

 ఋతురాజ్ గైక్వాడ్ కూడా చేతివేళ్ళకు గాయం కావడంతో చివరికి ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా వరుసగా కీలక ఆటగాళ్లు దూరం అవుతూ ఉండడంతో.. భారత జట్టుకు షాకులు తగులుతూనే ఉన్నాయి. అయితే జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ కూడా టెస్టు సిరీస్లో ఆడతాడా లేదా అనే విషయంపై కన్ఫ్యూషన్ నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ఏకంగా ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వెళ్ళాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే అతను తిరిగి వస్తాడా లేదా అనేదానిపై కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది అని చెప్పాలి.

 దీంతో విరాట్ కోహ్లీ లాంటి కీలక ప్లేయర్ లేకుండా దక్షిణాఫ్రికా పై టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ లో విజయం సాధించడం కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై టీమ్ ఇండియా అభిమానులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అందింది అని చెప్పాలి. ఈనెల 24వ తేదీన జట్టుతో చేరబోతున్నాడు విరాట్ కోహ్లీ.  ఇక సౌత్ ఆఫ్రికా గడ్డపై ప్రాక్టీస్ షురూ చేయబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ఈనెల 26వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా తో జరిగే టెస్ట్ సిరీస్లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం ఖాయం అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: