మాకు అన్యాయం జరుగుతోంది : దక్షిణాఫ్రికా బౌలర్
వెరసి అక్కడ ఆటగాళ్లు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పాలి. ఇక ఇటీవల కాలంలో చూస్తే దక్షిణాఫ్రికా ఏ ఫార్మాట్ లో కూడా ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోవడం అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి. ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగించిన దక్షిణాఫ్రికాకు ఇలాంటి పరిస్థితి రావడంతో ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడిపోయారు. అయితే ఇటీవల దక్షిణాఫ్రికా క్రికెట్ లో నెలకొన్న పరిస్థితులపై ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ అన్రిచ్ నోర్జె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ షాకింగ్ ఆరోపణలు చేశారు.
టెస్ట్ క్రికెట్ ఆడే విషయంలో తమకు తీరని అన్యాయం జరుగుతోంది అంటూ ఆరోపించాడు. ఇండియా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్లు వరుసగా టెస్టు సిరీస్ లు భాగంగా మ్యాచులు ఆడుతూ ఉంటే దక్షిణాఫ్రికా జట్టు మాత్రం కేవలం సింగిల్ క్రికెట్ మ్యాచ్ లకే పరిమితం అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ విషయంపై క్రికెట్ బోర్డు దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించాడు. కాగా ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే అక్కడ మూడు మ్యాచ్ల సిరీస్ ఆడబోతుంది.