పుజారా మరో సెంచరీ.. మొన్న ఎందుకు చేయలేదో

praveen
టీమిండియా క్రికెట్లో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు చటేశ్వర్ పుజారా. పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి పూర్తిగా దూరమైపోయిన పుజారా అటు టెస్టు జట్టులో మాత్రం ఎప్పుడూ స్థానం సంపాదించుకుంటూ ఉండేవాడు. టీమిండియా ఏ పర్యటనలో టెస్ట్ మ్యాచ్ ఆడిన కూడా అందులో  పుజారాకు తప్పకుండా స్థానం ఉండేది అని చెప్పాలి. అయితే గత కొంత కాలం నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు పూజారా.  ఈ క్రమంలోనే బీసీసీఐ అతని పక్కన పెట్టేసింది అనే విషయం తెలిసిందే.

 ఇలాంటి సమయంలోనే ఇంగ్లాండ్ కౌంటిలలో అవకాశం దక్కించుకున్న చటేశ్వర్ పుజారా మళ్లీ తిరిగి ఫాంలోకి వచ్చినట్లు గానే కనిపించాడు అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ కౌంటీ  లో భాగంగా ససేక్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న చటేశ్వర్ పుజారా.. అక్కడ వరుస సెంచరీతో అదరగొట్టాడు. డబుల్ సెంచరీలతో అందరి చూపులు తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాలో అవకాశం కూడా దక్కించుకున్నాడూ. కానీ ఇటీవల టీమ్ ఇండియా ఇంగ్లాండ్ వేదికగా ఆడిన ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడు పూజార.

 ఇక టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం మళ్లీ ఇంగ్లాండ్ లో జరుగుతున్న కౌంటీ క్రికెట్ లో భాగం అయ్యాడు పూజారా. ఇక ఇప్పుడు మరో సెంచరీ చేశాడు అన్నది తెలుస్తుంది. మిడిల్ సెక్స్, ససెక్స్ మధ్య ఇటీవలే మ్యాచ్ జరుగగా పుజారా సెంచరీతో అదరగొట్టాడు. 110 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కాగా జట్టు స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 318 గా కొనసాగుతోంది. కాగా కౌంటి ఛాంపియన్షిప్లో పుజారాకు ఇది ఐదవ సెంచరీ కావడం గమనార్హం. ఇందులో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయం తెలిసిన తరువాత ఇదే ప్రదర్శన మొదటి టెస్టు మ్యాచ్లో చేసి ఉంటే బాగుండేదని భారత అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: