టి20 వరల్డ్ కప్ : ఆ జట్టు ఓడిపోవాలి అంటున్న ఇండియన్ ఫ్యాన్స్?

praveen
ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సెమీఫైనల్లో బెర్త్ ఖాయం చేసుకోవడానికి అన్ని జట్లు కూడా హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే కొన్ని జట్లు వరుసగా విజయాలు సాధిస్తే సెమీఫైనల్లో స్థానం తగ్గించుకునే అవకాశం ఉండగా.. మరి కొన్ని జట్లకు మాత్రం తమ జట్టు ప్రదర్శనతో పాటు ఇతర జట్ల ప్రదర్శనలు కూడా సెమీఫైనల్లోకి రావడానికి కారణం గా మారిపోతున్నాయి. ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో మొదటి నుంచి వైఫల్యం చెందిన టీమిండియా పరిస్థితి అలాగే మారిపోయింది అని చెప్పాలి. టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా వరుసగా రెండు ఘోర ఓటమిలు చవిచూసింది.

 ఈ క్రమంలోనే ఇక టీమిండియా గెలిచి నిలిచి సెమి ఫైనల్ బెర్తును ఖాయం చేసుకోవాలి అంటే ఏదో అద్భుతం జరగాల్సి ఉంది. టీమిండియా అన్ని మ్యాచులు కూడా భారీ తేడాతో విజయం సాధించడమే కాదు సెమీఫైనల్కు వెళ్ళాలి అంటే న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలు కావాల్సి ఉంటుంది. ఇలా తమ ప్రదర్శన పైనే కాదు ఇతర జట్ల ప్రదర్శనలు పై కూడా టీమ్ ఇండియా సెమీ ఫైనల్లో కి వెళ్లడం అనేది ఆధారపడి ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా అద్భుతంగా రాణించిన టీమిండియా 65 పరుగుల తేడాతో విజయం సాధించింది.

 కాగా నేడు టీమిండియా స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్లో కూడా భారీ తేడాతో విజయం సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే న్యూజిలాండ్ జట్టు నమీబియా జట్టుతో మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఈ మ్యాచ్ ఎంతో కీలకం కాబోతోంది. సెమీస్లో అవకాశం దక్కించుకోవాలంటే న్యూజిలాండ్ మ్యాచ్ గెలవాలి.. అదే సమయంలో టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగు పడాలి అంటే  న్యూజిలాండ్ మ్యాచ్ ఓడిపోవాలి. అందుకే భారత అభిమానులు అందరూ న్యూజిలాండ్ ఈ మ్యాచ్లో ఓడిపోవాలి అని కోరుకుంటున్నారు. న్యూజిలాండ్ ఓడిపోతే టీమ్ ఇండియా సెమీస్ వెళ్తుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: