టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న టీం ఇండియా...

M Manohar
గత ఏడాది వాయిదా పడిన టీ 20 ప్రపంచ కప్ నిన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఇందులో నిన్న క్వాలిఫైయర్ మ్యాచ్ ప్రారంభం అయ్యాయి. ఇక ఇప్పటికే ఈ ప్రపంచ క్యూ కోసం అర్హత సాధించిన 8 జట్ల మధ్య ఈరోజు వార్మప్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బౌలింగ్ తీసుకొని ఇంగ్లాండ్ జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తున్నారు.. అయితే వార్మప్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడటం లేదు. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఓపెనర్గా వస్తున్నాడు. ఈగ ఇది వామప్ మ్యాచ్ కాబట్టి ఏ ఆటగాడైనా మ్యాచ్ మధ్యలో వచ్చి జట్టులో చేరవచ్చు... అలాగే జట్టు నుండి బయటకు కూడా వెళ్ళవచ్చు. అయితే ఈ నెల 23న పాకిస్తాన్ కు వ్యతిరేకంగా టీ20 ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనున టీమిండియా ఈ మ్యాచ్ ను కీలకంగానే భావిస్తోంది. ఎందుకంటే ఇందులో విజయం సాధిస్తే జట్టు ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది అని తెలిసిందే. చూడాలి మరి ఈ వార్మప్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అనేది

భారత జట్టు : ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (c), రిషబ్ పంత్ (wk), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్
ఇంగ్లాండ్ జట్టు : జాసన్ రాయ్, జోస్ బట్లర్ (c & wk), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, మార్క్ వుడ్

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: