నేను తప్పుకుంటున్నా.. ఊహించని షాకిచ్చిన క్రిస్ గేల్?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో యూనివర్సల్ బాస్ గా కొనసాగుతున్నాడు క్రిస్ గేల్. ఒకసారి మైదానంలోకి దిగాడు అంటే చాలు పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. 40 ఏళ్లు దాటిన పోతున్న ఎంతోమంది యువకులకు పోటీ ఇస్తున్నాడు. అందుకే ప్రపంచవ్యాప్తంగా క్రిస్ గేల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే అటు భారత అభిమానులకు కూడా క్రిస్ గేల్ ఐపీఎల్ ద్వారా బాగా దగ్గరయ్యాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని పంజాబ్ కింగ్స్ జట్టులో కీలక బ్యాట్స్మెన్గా కొనసాగుతున్నాడు క్రిస్ గేల్. ఇకపోతే  ప్రస్తుతం ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు పరిస్థితి అధ్వానంగా మారిపోయింది.



 ప్లే ఆఫ్ కి అర్హత సాధించడానికి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇటీవలే పంజాబ్ కింగ్స్  జట్టుకి ఊహించని షాక్ తగిలింది. ఏకంగా పంజాబ్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న క్రిస్ గేల్ తాను జట్టుని వీడుతున్నట్లు ఇటీవలే ప్రకటించి షాకిచ్చాడు. ఇక క్రిస్ గేల్ తీసుకున్న అనూహ్య నిర్ణయం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. అయితే నేడు కోల్కతా నైట్ రైడర్స్ తో కీలక మ్యాచ్ ఆడాల్సి ఉంది పంజాబ్ కింగ్స్ జట్టు. ఈ మ్యాచ్  ముంగిట తాను జట్టుని వీడుతున్నాను  అంటూ ప్రకటించాడు. దీంతో అభిమానులు అందరిలో కూడా ఆందోళన మొదలైంది.



 కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఏర్పాటుచేసిన బయో బబుల్ లో  ఉండి విసిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ గేల్ స్పష్టం చేశాడు.  2021 సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడిన గేల్ 125 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో ఒక్కసారి కూడా క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ నమోదు చేయకపోవడం గమనార్హం. ఇక మరోవైపు 2021 ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: