"ధోనీ"నే టీమిండియా హెడ్ కోచ్ ?
ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి మరియు ఇషాన్ కిషాన్ లను తీసుకోవడంపై గందరగోళం నెలకొంది. ఇంకో వైపు ఒకరి సెలక్షన్ మాత్రం ప్రేక్షకులను సంతోషానికి గురి చేస్తోంది. టైటిల్ ను గెలవడమే లక్ష్యంగా వరల్డ్ కప్ కు వెళుతున్న టీం ఇండియాలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరు ఉండడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే ధోని పేరు చూడగానే అందరూ ఏమిటి ధోని రిటైర్ అయ్యారు కదా? మళ్ళీ ఎలా అనే ఆలోచనలో పడ్డారట.. అయితే బీసీసీఐ క్లారిటీ ప్రకారం ధోని టీం కు మెంటార్ గా వ్యహరించనున్నట్లు తెలిపింది. అయితే ఇది విన్న ధోని అభిమానాలు ఆనంద డోలికల్లో తూలుతున్నారు.
ఇది తెలిసిన మరి కొంత మంది అభిమానులు ధోని కనుక మెంటార్ గా సక్సెస్ అయితే నెక్స్ట్ హెడ్ కోచ్ కూడా ఇతనే అవుతాడని ప్రచారం ఊపందుకుంది. మరి ఇది వినడానికి బాగానే ఉన్నా ఇలా జరిగే అవకాశం లేదంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. అయితే ముందు ముందు బీసీసీఐ ఇంకెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుటునుందో తెలియాల్సి ఉంది.