ఐపీఎల్ 2021 : ధోని గెలుస్తాడా.. ధోని వారసుడు నిలుస్తాడా..?

praveen
ఐపీఎల్ మజా షురూ అయింది.. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఎంజాయ్ చేసేందుకు అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా సిద్ధమైపోయారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ప్రారంభ పోరు ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్ల మధ్య జరిగింది అన్న విషయం తెలిసిందే.  ఇక మొదటి పోరులో ఎవరో ఒకరు విజయం సాధిస్తారు అనుకున్నప్పటికీ చివరి బాల్ వరకు ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంది.  ఇక మొదటి మ్యాచ్ తోనే ఈ ఐపీఎల్ సీజన్ ప్రేక్షకులందరినీ కూడా నరాలు తెగే ఉత్కంఠత మధ్య కన్నార్పకుండా చేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఎంతో హోరాహోరీగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో చివరికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. అయితే మొదటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. ముఖ్యంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో బ్యాటింగ్ విభాగం బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించింది. ఇకపోతే నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. నేడు సాయంత్రం ఏడున్నర గంటలకు చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ పై కూడా ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ వైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు.



 మరోవైపు ధోని వారసుడిగా భారత క్రికెట్ లో పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కి సారధి గా వ్యవహరిస్తున్నాడు.  అయితే ఈ రెండు జట్లలో హాట్ ఫేవరేట్గా చెన్నై సూపర్ కింగ్స్ ఉన్నప్పటికీ ఇక ధోని వారసుడు గా పేరు తెచ్చుకున్న రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఎలా రాణించ బోతున్నాడు అన్నది కూడా ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.  ధోనీ గెలుస్తాడా లేదా ధోని వారసుడు గెలిచి నిలుస్తాడా అన్నది ప్రస్తుతం మరింత అంచనాలు పెంచేసింది. దీంతో ఈ మ్యాచ్ కోసం అటు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: