విరుష్క రొమాంటిక్ ఫోటో.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి

praveen
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ జంటకు సోషల్ మీడియాలో ఎంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వీరికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా  అది సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. వీరిద్దరూ కలిసి చిన్న ఫోటో దిగిన అది చూసిన అభిమానులు అందరూ మురిసిపోతూ ఉంటారు. వీరిద్దరూ ప్రేమలో మునిగితేలిన సమయంలోనే వీరిద్దరు జంటను చూసి మురిసిపోయిన ప్రేక్షకులందరూ వీరు  డెస్టినేషన్ వెడ్డింగ్స్ తో ఒకటి కావడంతో మరింత సంతోష పడిపోయారు. ఇటీవలే అనుష్క శర్మ విరాట్ కోహ్లీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో... అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.


 ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మునుపటిలా కాకుండా అంచనాలకు తగ్గట్టుగానే ఆడుతుంది. విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇక ఇటీవల అనుష్క శర్మ కూడా యూఏఈ చేరుకోవడంతో విరాట్ కోహ్లీ లో మరింత జోష్ నిండిపోయింది అనే చెప్పాలి. ప్రస్తుతం ఎంతో ఉత్సాహంలో ఉన్న విరాట్ కోహ్లీ అనుష్క శర్మ తో ఎంతో ఆనందంగా సమయం గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే వీరిద్దరికీ సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోని చూసి అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు.

 ఇటీవలే అనుష్క శర్మ విరాట్ కోహ్లీ దిగిన ఒక రొమాంటిక్ ఫోటో సోషల్ మీడియా వేదికగా అందరినీ ఆకర్షిస్తోంది. పూర్తిగా నీళ్ళలోకి దిగి... ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తూ... ప్రేమ లోకం లో మునిగి తేలు తో రొమాంటిక్ గా ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసి అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు. కాగా ఈ ఫోటోని విరాట్ కోహ్లీ స్నేహితుడు ఎబి డివిలియర్స్ తీసినట్లు తెలుస్తోంది. కాగా విరాట్ కోహ్లీ-అనుష్క జంటకు అభిమానులు అందరూ ఎంతో ప్రేమగా విరుష్క అనే ముద్దుపేరు కూడా పెట్టుకుని విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: