ఈనెల లో బంగ్లాదేశ్ జట్టు పాకిస్థాన్ లో పర్యటించాల్సి వుంది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టు తో బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ ల టీ 20 సిరీస్ తో పాటు రెండు టెస్టులు కూడా ఆడాల్సి వుంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా బీసీబీ టీ 20 సిరీస్ మాత్రమే ఆడుతామని తేల్చిచెప్పింది. పాక్ కు కూడా అందుకు అంగీకరించింది. దాంతో ఈనెల 24,25,27 న లాహోర్ వేదికగా ఈ మూడు మ్యాచ్ ల టీ 20సిరీస్ జరుగనుంది. ఈ పర్యటనకు బంగ్లా స్టార్ బ్యాట్స్ మెన్ , వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ దూరంగా వున్నాడు. తన కుటుంభ సభ్యుల కోరిక మేరకే నేను ఈపర్యటన నుండి తప్పుకుంటున్నాను, నేను పాక్ వెళ్లడం మా వాళ్లకు ఇష్టం లేదు.. వారిని బాధ పెట్టకూడదనే ఈనిర్ణయం తీసుకున్నానని ముష్ఫికర్, బీసీబీకి రాసిన లేఖ లో పేర్కొన్నాడు.
ఇక బీసీబీ.. పాక్ తో తలపడే బంగ్లా జట్టును ప్రకటించింది. ఈ జట్టులో బంగ్లా సీనియర్ ఆటగాళ్లు తమీమ్ ఇక్బాల్ ,రూబెల్ హాసన్ లు చోటు సంపాదించుకున్నారు.
బంగ్లాదేశ్ జట్టు : తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ , లిట్టన్ దాస్ , మహమ్మదుల్లా(కెప్టెన్) , మెహదీ హాసన్ ,మహ్మమద్ మిథున్ , ముస్తాఫిజుర్ రెహమాన్,మహమ్మద్ నయిం,ఆల్ అమిన్ హుస్సేన్ , రూబెల్ హాసన్ ,నజముల్ హుస్సేన్ ,అఫిఫ్ హుస్సేన్ ,షఫీయుల్ ఇస్లాం , హాసన్ మాహముద్ ,అమినుల్ ఇస్లాం