అర్షద్ నదీమ్కు ప్రశంలసల వర్షం కురిపించిన నెటిజన్లు
ఇటీవల నెటిజన్లు భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ)పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు నెటిజన్లు ఏఎఫ్ఐపై కామెంట్లు పెడుతున్నారు.రెండు దేశాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని కేవలం క్రీడలు మాత్రమే రూపుమాపగలవని, దాని కోసం ఏఎఫ్ఐ ముందుడుగేసిందని కామెంట్ చేస్తున్నారు. అస్సలు ఇంతగా ఏఎఫ్ఐపై ప్రశంలసల వర్షం కురవడానికి బలమైన కారణమే ఉంది. దక్షిణాసియా క్రీడల్లో పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్(జావెలిన్ త్రో) స్వర్ణం గెలవడం అంతే కాకుండా టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అథ్లెట్ అర్షద్ నదీమ్ అర్హత సాధించాడు. దీనిపై తమ అధికారిక ట్విటర్లో ఏఎఫ్ఐ స్పందించింది.
కంగ్రాట్స్ టూ ‘పాకిస్తాన్ జావెలిన్ త్రో స్టార్ అర్షద్ నదీమ్ . దక్షిణాసియా గేమ్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలవడంతో పాటు నేరుగా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించడం నిజంగా ఒక అభినందనీయం. ఇలా రెండు ఒకే ఛాన్సులో రావడమన్నది గొప్ప విషయమే తొలి పాకిస్తాన్ అథ్లెట్గా అర్షద్ దశాబ్దాల తర్వాత నేరుగా ఒలింపిక్స్ అర్హత సాధించి ఒక రికార్డు నెలకొల్పాడు’అంటూ ట్వీట్ చేసింది ఏఎఫ్ఐ. అంతేకాకుండా భారత జావెలిన్ స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రాతో అర్షద్ కలిసి ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది.
ప్రస్తుతం భారత అథ్లెటిక్స్ సమాఖ్య చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కేవలం క్రీడల మాత్రమే రెండు దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని తొలగించగలవు అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. మరికొంత మంది రెండు దేశాల మధ్య సయోధ్య, సత్సంబంధాలు తిరిగి పునరుద్దరించుకోవాలంటే కేవలం క్రీడలు మాత్రమే ఉపయోగపడతాయి అంటూ ట్వీట్ చేశారు .
ప్రస్తుతం ఈ రకమైన పోస్ట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి . ఇక భారత్-పాక్ దేశాల మధ్య తిరిగి శత్రుత్వంముంబై దాడుల అనంతరం తారాస్థాయికి చేరగా.. పుల్వామా టెర్రర్ అటాక్ అనంతరం ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయిన విషయం తెలిసిందే.