హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు భారం దించుకుంటున్నాడా ?
ఎందుకిలా జరిగిందంటే ఈ కార్యక్రమంలో తాను కానీ కళా కానీ ఇంకే సీనియర్ నేతలైనా హాజరైతే అటెన్షన్ అంతా అటు కూడా ఉంటుంది. అదే రెండో నేత లేకుండా కేవలం లోకేష్ మాత్రమే హాజరైతే అందరి అటెన్షన్ మొత్తం నారావారి వారసుడి మీదే ఉంటుంది. అలాగే మూడు రోజుల క్రితం రాజధాని గ్రామాలైన ఉద్దండవారి పాలెం, దొండపాడు, నేలపాడు తదితర గ్రామాల్లో పర్యటించాడు. సరే దొండపాడులో జనాలు ఎదురు తిరిగారనుకోండి అది వేరే సంగతి. తాజాగా వరద ముంపు ప్రాంతాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డిపై అర్ధంలేని ఆరోపణలు, విమర్శలు చేశాడు. రైతాంగాన్ని ఆదుకోవాలట, గిట్టుబాటు ధరలు కల్పించాలట, తడిసిపోయిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలట. నిజానికి లోకేష్ డిమాండ్ చేసిన వాటిని ప్రభుత్వం ఎలాగూ చేస్తుంది. కాకపోతే వర్షాలు తగ్గిపోయినాక, ముంపు తెరిపిచ్చినాక మాత్రమే చేయగలుగుతుంది.
ఎందుకంటే వర్షాలు పడుతుంటే ఏ ప్రభుత్వం కూడా పంటలను కొనలేందు. ముందు ముంపు, వర్షాల బాధితులకు సహాయ పనులను చేయటంపైనే దృష్టి పెడుతుంది. వర్షాలు తగ్గిన తర్వాత ఉన్నతాధికారుల అంచనాలు తయారు చేసిన తర్వాత మాత్రమే కొనుగోలుకు రెడీ అవుతుంది. ఇంతోటి దానికి లోకేష్ నానా హడావుడి చేయటమే విచిత్రంగా ఉంది. అసలు తమ హయాంలో ఇటువంటి సందర్భాలు వచ్చినపుడు ప్రభుత్వం ఏ మేరకు రైతులకు సాయం చేసిందన్న విషయాన్ని లోకేష్ ముందు వివరిస్తే బాగుంటుంది. సరే ఏదేమైనా లోకేష్ తండ్రి పక్కన లేకుండా పర్యటనలు చేయటమే ఆశ్చర్యం. ఎందుకంటే ప్రతి విషయంలోను చంద్రబాబు దగ్గరుండి మరీ పుత్రరత్నానికి స్పూన్ ఫీడింగ్ చేసినా ఎక్కడా ఉపయోగం కనబడటం లేదు. ఎందుకంటే సొంతంగా ఆలోచించి ప్రభుత్వంపై సరైన ఆరోపణలు, విమర్శలు చేసేంత సీన్ లోకేష్ కు లేదని అందరికీ తెలిసిందే.