ఛాన్స్ కొట్టేసిన తిలక్ వర్మ.. వావ్ అంటున్న ఫ్యాన్స్?
ముంబై ఇండియన్స్ జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ ఈ ఏడాది టాక్ ఆఫ్ ది ఐపీఎల్ గా మారిపోయాడు. ఒకవైపు ముంబై జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తున్న సమయంలో కూడా తిలక్ వర్మ మాత్రం ఒత్తిడిని చిత్తు చేస్తూ ఎంతో మంచి ప్రదర్శన చేసి తన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో టాప్ స్కోరర్గా నిలిచాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనికి తక్కువ సమయంలోనే టీమిండియాలో చోటు దక్కడం ఖాయం అని అందరూ అనుకున్నారు.
ఇక మరో తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్ కూడా కీపింగ్ లో బ్యాటింగ్ విభాగంలో ఐపీఎల్ లో బాగా రాణించి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు ఇటీవలే ఒక మంచి అవకాశాన్ని అందుకున్నారు. మరికొన్ని రోజుల్లో న్యూజిలాండ్ ఏ జట్టుతో భారత్ ఏ జట్టు తలపడుతుంది. వచ్చేనెల నాలుగు రోజుల చొప్పున మూడు మ్యాచ్లు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 1న మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఇద్దరు యువ ఆటగాళ్లు భారత్ ఏ జట్టు తరపున అవకాశం దక్కించుకున్నాడు. ఇక్కడ బాగా రాణించి టీమిండియా లోకి వెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు ..