మోడీని సొంత వాళ్లే ముంచేస్తున్నారా..?!

Padmaja Reddy

ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కాంగ్రెస్ పార్టీ భలే హెచ్చరిక జారీ చేసింది. మోడీని సొంత వాళ్లే ముంచేస్తున్నారని.. ఇంటిలోని వారే ప్రధానికి ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత గులాంనబీ ఆజాద్ రాజ్యసభలో వ్యాఖ్యానించాడు. అసలు మోడీకి కాంగ్రెస్ నుంచి పెద్దగాప్రమాదం లేదు.. కాషాయధారుల నుంచే ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని ఆజాద్ వ్యాఖ్యానించాడు.

మదర్ థెరిస్సా గురించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యానాలను ప్రస్తావిస్తూ ఆజాద్ ఈ విధంగా వ్యాఖ్యానించాడు. మదర్ థెరిస్సా కూడా మత మార్పిడిలకు పాల్పడ్డారని భగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా.. ఆర్ఎస్ ఎస్ పెద్దకూ బీజేపీకీ ఏ మాత్రం సంబంధం లేదని కమలనాథులు స్పష్టం చేశారు.

భుత్వానికి సంబంధంలేని ఆయన మాటల గురించి చర్చించాల్సిన అవసరం లేదని బీజేపీ వాళ్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. కాషాయదళాన్ని కమలనాథులు వెనకేసుకు రావొచ్చు కానీ.. దీని వల్ల ప్రధానమంత్రి కి మాత్రం కచ్చితంగా ప్రమాదమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

వాస్తవంగా చూస్తే కాంగ్రెస్ నేతల మాటల్లోనూ కొంత నిజం ఉంది. బీజేపీ అనుకూల దళం మాట్లాడుతున్న మాటలను ప్రధానమంత్రి ఇంత వరకూ ఖండించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మదర్ థెరిస్సా గురించి వ్యాఖ్యానాలు చేసేంత వరకూ వచ్చింది పరిస్థితి. మరి ఇలాంటి విషయాలు ఆలోచనపరులను బీజేపీకి దూరం చేసే అవకాశాలున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: