పవన్ కళ్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన భీమవరం గ్రంధి శ్రీనివాస్..!

KSK
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వైసీపీ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా రాబోతున్న ఎన్నికలకు పోటీ చేస్తున్న గ్రంధి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కాండేట్ ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు భీమవరం పట్టణం గురించి అభివృద్ధి గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని.


తన స్థాయికి తగ్గట్టు మాట్లాడితే మంచిది అని పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న వారు ఆయన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఒక నటుడిగా పవన్ కళ్యాణ్ మీద నాకు అభిమానం ఉందని గ్రంధి శ్రీనివాస్ అన్నారు. ఒక ముఖ్యమంత్రి క్యాండెట్ అయి ఉండి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడాలి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి మాట్లాడాలని గ్రంధి శ్రీనివాస్ సూచించారు.


ఎవరు ఎన్ని చేసిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో సామాన్య ప్రజలంతా గమనిస్తున్నారని గ్రంధి శ్రీనివాస్ అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: