ఈ సారి ఏపీ లో డబ్బు ఎన్నికలు అంత వీజీ కాదేమో !

KSK

భారత్ లాంటి దేశాల్లో ఎన్నికలు అనేవి సహజంగానే డబ్బు చుట్టూ తిరుగుతాయి అని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ప్రతీ ఒక్కరి సిద్ధాంతం లో డబ్బు ప్రధాన భూమిక పోషించడం మనం మొదటి నుంచీ చూస్తూనే ఉన్నాం.


ఎంత నిజాయతీ గల నేత అయినా డబ్బుల విషయం లో వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఇంతకు ముందు ఎన్నికల్లో కూడా చూసాం. అయితే రానున్న 2019 ఎన్నికల విషయం లో ఎన్ని వేల కోట్ల డబ్బు చేతులు మారుతుంది అనేది ప్రధాన ప్రశ్నగా మారింది.

చివరికి ఎలక్షన్ కమీషన్ వారు కూడా దీని గురించి కంగారు పడ్డం విశేషం. ఈ సారి అన్ని రకాలుగా డబ్బులు పంచే కార్యక్రమం దగ్గర నుంచీ , జనాల కి వస్తువులు పంపిణీ  చెయ్యడం .. క్యాడర్ కి మందు పోయించడం ఇలా అన్ని అంశాల్లో కూడా ఈసీ నాయకులని అడ్డుకునే పనిలో ఫుల్ బిజీ గా ఉన్నట్టు తెలుస్తోంది.


2019 ఎన్నికలు గతం లో జరిగిన ఎన్నికల కి చాలా విభిన్నంగా జరగాలి అంటూ దేశ వ్యాప్తంగా అనేక ప్రణాళికలతో ఈసీ ఇప్పటికే సిద్ధమైపోయింది. చూడాలి మరి ఏ రకంగా ఈసీ మన నాయకులని అడ్డుకోగాలుగుతుందో !



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: