మోడీ సర్కార్ కి ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన బీజేపీ ఎంపీ..!
ఇలా ఇష్టమొచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని సొంత నేతలకే తలనొప్పిగా మారిన మోడీ సర్కార్ పై దేశంలో ప్రస్తుతం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇటీవల బిజెపి పార్టీకి చెందిన ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు దేశంలోనే కాక బీజేపీ పార్టీలో కూడా కలకలం అయ్యాయి.
ఇటీవల సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ..షాకింగ్ కామెంట్లు చేశారు. బీజేపీ నేతలే ఆలయ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణంపై ముస్లిం వర్గాలకు కూడా అభ్యతరం లేదనీ.. అయినా కూడా కేంద్రంలోని మోదీ సర్కార్.. యూపిలోని యోగి ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేస్తే సంహించేది లేదని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. రామ మందిరాన్ని అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తే ప్రభుత్వాలను కూల్చేందుకు వెనకాడనని సుబ్రహ్మణ్యం స్వామి వార్నింగ్ ఇచ్చారు. దీంతో సుబ్రహ్మణ్యస్వామి చేసిన కామెంట్లు బిజెపి పార్టీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.