ఈశా అంబానీ పెళ్లి వేడుకకి చంద్రబాబు...!

Chakravarthi Kalyan

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఈనెల 12 ముంబైలో ముకేశ్ అంబానీ కూతురు ఈశా అంబానీ వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. పెళ్లికొడుకు కూడా వ్యాపార దిగ్గజ కుటుంబానికి చెందినవాడే. పిరమాల్ కుటంబానికి చెందిన ఆనందర్ పిరమాల్ ను ఈశా వివాహమాడబోతోంది.



అంబానీల ఇంట పెళ్లి వేడుక అంటే మాటలా.. ఇప్పటికే వివాహ వేడుకల ప్రారంభమయ్యాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌‌లో ఇప్పటికే అన్నదానం ప్రారంభమైంది. ఈ వివాహ వేడుకకు దేశంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముంబై వెళ్లనున్నట్లు సీఎంవో వర్గాలు తెలిపాయి. చంద్రబాబుతో ముకేశ్ అంబానీకి గతంలోనే సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల ముకేశ్ అంబానీ అమరావతి వచ్చినప్పుడు సీఎం స్వయంగా ఆయన్ను ఆర్టీజీఎస్ సెంటర్ కు తీసుకెళ్లి అక్కడి పనితీరును వివరించారు. తన ఇంట్లో విందు ఏర్పాటు చేశారు.

ఈశా అంబానీ పెళ్లి వేడుకకు చంద్రబాబు హాజరుకావడాన్ని సీఎంఓ కూడా ధ్రువీకరించింది. ఈనెల 12న చంద్రబాబు ముంబై వెళతారని తెలిపింది. ఈ పెళ్లికి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగానూ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: