పదవి అంటే ఎందుకు అంత ఆరాటం పవన్ పై లోకేష్ సెటైర్లు..!

KSK
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో అక్రమ మైనింగ్ అంటూ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపై మరియు చంద్రబాబు ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడుతూ వీడియో పెట్టడం జరిగింది.


ఈ వీడియోలో టి డి పి నాయకులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తూ ఘాటుగా మాట్లాడటం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇస్తూ నారా లోకేష్ తన ట్విటర్ అకౌంట్ లో సంచలన ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ దత్తపుత్రుడు అంటూ సెటైర్లు వేశారు.


రాష్ట్రంలో అవినీతి జరిగిందంటూ గగ్గోలు పెడుతున్న పవన్ వాటిని నిరూపించమంటే ప్యాకప్ అన్నారని విమర్శించారు.మరోసారి బాక్సైట్ మసిపూసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పదవికోసమే పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం మాని ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు.


మరోవైపు మోడీ ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం చేసారంటూ పవన్  ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఏదని ప్రశ్నించారు. నివేదిక ఇచ్చినా ఎందుకు ప్రశ్నించడం లేదని ట్విట్టర్ వేదికగా నిలదీశారు. రాబోయే ఎన్నికలలో ఇతర పార్టీ నేతల పై బురద జల్లి రాజకీయ లబ్ది పొంది అధికారం దక్కించుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని లోకేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో నారా లోకేష్ పై సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు నెటిజన్లు మీ నాన్నకి ఉన్నంత పదవి వ్యామోహం పవన్ కళ్యాణ్ కి లేదు అంటూ కౌంటర్ లు వేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: