ఒకటైపోయినా బాబాయ్ అబ్బాయి….సంబరాలు చేసుకుంటున్న నందమూరి అభిమానులు..!

KSK
నందమూరి హరికృష్ణ మరణించడంతో చాలామంది నందమూరి అభిమానులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సన్నిహితులు ఒక సాగరంలో మునిగిపోయారు. ముఖ్యంగా తన అన్న చనిపోవడంతో బాలకృష్ణ అన్నీ తానే వ్యవహరించినట్లుగా హరికృష్ణ అంత్యక్రియలలో పాల్గొని హరికృష్ణ ఇద్దరు కుమారులైన కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ని ఓదార్చడం జరిగింది.


ఈ పరిణామంతో నందమూరి అభిమానులకు కొంత ఊరట కలిగింది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య వివాదాలు ఉన్నట్టు...అందు మూలంగానే నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం కి పిలవలేదు అన్న వార్తలు కూడా వచ్చాయి.


అయితే తండ్రి హరికృష్ణ మరణంతో దుఃఖసాగరంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని బాలకృష్ణ ఇటీవల పలకరించడం జరిగింది. భోజన సమయంలో బాలకృష్ణ కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో మాట్లాడారు. నేనున్నాను.. బాధపడకండి అంటూ ధైర్యాన్ని ఇచ్చారు.అలా కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో బాలయ్య మాట్లాడుతున్న వీడియో బయటికి వచ్చింది.


ఈ వీడియో చూసిన వారంతా “ఇది కదా మేము కోరుకునేది” అని సంబరపడుతున్నారు సినీ అభిమానులు . ఈ ముగ్గురు కలకాలం ఇలాగే కలిసి ఉండాలని దేవుళ్లను కోరుకుంటున్నారు. అయితే మరోపక్క ఇద్దరు అన్నదమ్ములు తమని నమ్ముకుని సినిమాలు తీస్తున్న నిర్మాతలు నష్టపోకూడదని యధావిధిగా తాము ఒప్పుకొన్న సినిమా షూటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: