అనంత జిల్లాలో రెచ్చిపోయిన పరిటాల మనుషులు…!

KSK
అనంతపురం జిల్లాలో పరిటాల వర్గానికి చెందిన మనుషులు సామాన్యులపై దాడులకు తెగబడ్డారు. తాజాగా ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అనంతపురం జిల్లాలో పర్యటించిన నేపద్యంలో...అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీ ఎత్తున జనాలు తీసుకురావడానికి జిల్లా తెలుగుదేశం నాయకులు నానా తంటాలు పడ్డారు.


ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు గాని... ప్రభుత్వ కార్యక్రమాలకు గాని అనంత జిల్లాలో ఎవరు హాజరవటం లేదు. ఏదో అధికారంలో ఉన్న అహంకారంతో పరిటాల మనుషులు టి దుకాణదారుడు పై దాడికి తెగబడ్డారు.


ముఖ్యమంత్రి మీటింగ్ కి రాకుండా టీ కొట్టు ఓపెన్ చేసినందుకు కొట్టులో ఉన్న తిను బండారాల డబ్బాలని పగలకొట్టి బీభత్సం చేసిన షొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి.


అంతేకాదు.. ఈ జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించిన వ్యక్తి తల పగలకొట్టి పరిటాల మనుషులు దారుణంగా ప్రవర్తించారట..అంతేకాకుండా సభకు రాని కాకర మహిళలకు రూ.400 కట్ చేసేస్తామంటూ బెదిరింపులకు తెగబడ్డారు. దీంతో అనంత జిల్లాలో టీడీపీ నేతలు...పరిటాల మనుషులు చేసిన హడావిడి చూసి అనంత వాసులు మండిపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: