ఈ ఒక్క దెబ్బ చాలు 2019లో బాబు కుర్చీ మటాష్ !

KSK
వైసీపీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర చేస్తున్నారు...ఈ క్రమంలో మొన్నటివరకు ఎండలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన ఎక్కడా కూడా ఆపని జగన్ తాజాగా జోరు వర్షంలో కూడా ముందుకు దూసుకుపోతున్నారు. ఈ యాత్రలో ప్రజా సమస్యలు వింటూ వారికి ధైర్యం చెబుతూ చంద్రబాబు చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తున్నారు.


ఇదిలావుండగా తాజాగా వైసీపీ మంగళగిరి శాసనసభ్యుడు ఆర్కే ( ఆళ్ల రామకృష్ణారెడ్డి ) జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉన్న నేపథ్యంలో ఆసక్తికరమైన సంచలన కరమైన విషయాలు వెల్లడించారు...ఆర్కే మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చెయ్యడం గొప్ప విషయం కాకపోవచ్చు కానీ వాటిని స్పీకర్ ఆమోదించడం చాలా గొప్ప విషయమని అన్నారు.


నంధ్యాల ఎన్నికల్లో జరిగిన మోసం అందరికీ తెలుసు కానీ బాబు మాత్రం ప్రజలు మా వైపే ఉన్నారు అందుకే మేము గెలిచామని చెప్పుకున్నాడు .అయితే ఎన్నికలు జరిగే సమయంలో పోలింగ్ భూత్ ఏజెంట్లు , కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర అమోఘమని ఆయన పేర్కొన్నారు . ఇలాంటి పని తీరే రాష్ట్రంలో ఉన్న మొత్తం 175 నియోజక వర్గాల్లో ఉంటె 2019 లో జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.


అంతేకాకుండా రాష్ట్రంలోని చంద్రబాబు లోకేష్ చేస్తున్న అవినీతి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చాక తండ్రి కొడుకులకు ఇద్దరికీ.. చేసిన అవినీతికి అలాగే చేసిన మోసానికి భారీ మూల్యం చెల్లించుకునే విధంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: