ఆ విషయంలో పవన్ ఫ్యాన్స్‌కు ఝలక్ ఇచ్చాడు..!

Edari Rama Krishna
తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాలతో ఎంతో మంది అభిమానుల అభిమానం సంపాదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ‘జనసేన’ పార్టీ స్థాపించి ఆ పార్టీ తరుపు నుంచి ప్రభుత్వాన్నినిలదీస్తూ ప్రజలకు అండదండగా ఉంటున్నారు.  ఇక వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీలో నిలబడేందుకు సిద్దమైన పవన్ కళ్యాన్ తెలుగు రాష్ట్రాల్లో జనసేన బలోపేతం చేయడానికి కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ నేపథ్యంలో శుభమ్ గార్డెన్స్ లో నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, క‌రీంన‌గ‌ర్ నసేన కార్యకర్తలు, అభిమానులతో సమావేశమైన విషయం తెలిసిందే.   జనసేన అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన ‘చలోరే...చలోరే చల్’ యాత్ర బుధవారం ఖమ్మం జిల్లాలో జరుగుతుంది. ఉదయం 9 గంటలకు కొత్తగూడెంలో జనసేన కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. 

తనకు ఆతిథ్యం ఇచ్చిన కొత్తగూడెం ప్రజలకు జనసేన అధ్యక్షుడు కృతఙ్ఞతలు తెలిపారు.  కొత్త గూడెం సమస్యలు అర్థం చేసుకోవడానికే వచ్చానని అన్నారు. సెల్ఫీలు, ఫొటోలు కన్నా ప్రజాసమస్యల పరిష్కారమే తనకు ముఖ్యమని ఫ్యాన్స్ కి భలే ఝలక్ ఇచ్చారు.  ఇప్పటి నుంచి పూర్థి స్థాయి రాజకీయాల్లో ఉంటూ.. ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్గొండ జిల్లాల అభిమానులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొనబోతున్నారు.  

పవన్ కోసం ప్రత్యేక అభిమాని :
మూడు రోజుల పర్యటన నిమిత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు సతీష్ అనే అభిమాని స్ట్రెచర్‌పైనే వచ్చాడు.  పవన్ కళ్యాన్ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఎంతో అభిమానించే సతీష్ గతంలో త్రివిక్రమ్- పవన్ కాంబినేషన్ లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఫ్లెక్సీ కట్టే సమయంలో  కరెంట్ షాక్‌తో రెండు కాళ్లను కోల్పోయాడు సతీశ్. అప్పటి నుంచి మంచానికే పరిమితం కాగా.. పవన్ వచ్చాడని తెలిసిన అతడి తల్లిదండ్రులు స్ట్రెచర్‌పైన తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సతీశ్‌కు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: