"ఓజి" మూవీకి ఆ విషయంలో పెద్ద షాక్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. అందులో ఓజి మూవీ ఒకటి. ఈ మూవీ కి యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో పవన్ కి జోడిగా కనిపించబోతుంది. ఈ సినిమాను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి వి వి ధానయ్య నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ మూవీ నుండి చాలా రోజుల క్రితమే మేకర్స్ ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను విడుదల చేయగా ఇది ఇండస్ట్రీ లో సంచలనాన్ని సృష్టించింది. ఈ ఒక్క వీడియోతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ కావడంతో చాలా రోజుల క్రితం ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. ఇకపోతే ఈ సినిమాపై భారీ హైప్ ఉన్నప్పటికీ ఓ విషయంలో మాత్రం ఓజి మూవీ యూనిట్ కి కష్టాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటి వరకు ఈ సినిమాకు "ఓ టి టి" డీల్ కంప్లీట్ కాలేదు అని ఒక వేల మరి కొంత కాలం కూడా ఈ సినిమాకు "ఓ టి టి" డీల్ కంప్లీట్ కాకపోతే ఈ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేసే చేయడం కష్టమే అని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే మరి కొంత మంది ఇంత క్రేజ్ ఉన్న సినిమాకు "ఓ టి టి" డీల్ సెట్ కాకపోవడం ఏంటి అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ ప్రస్తుతం ఓజి మూవీ తో పాటు హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలలో కూడా హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఈ మూడు సినిమాలలో కూడా ఓజి మూవీ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: