ఆ తేదీ నుండి ఓటిటి లో అజయ్ దేవగణ్ "సైతాన్"..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అజయ్ దేవగన్ తాజాగా సైతాన్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మాధవన్ , జ్యోతిక , జంకి బొడివాల ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించగా ... వికాస్ బాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ సూపర్ నాచురల్ హార్రర్ జోనర్ మూవీ గా రూపొంది మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఇలా అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలువడింది. ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు దక్కించుకున్నారు.

అందులో భాగంగా ఈ సినిమాను మే 4 వ తేదీ నుండి తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయరున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఇప్పటికే థియేటర్ లలో ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించుకొని ఉండడంతో ఈ మూవీ "ఓ టి టి" లోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రేక్షకుల నుండి ఏ స్థాయి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: