‘నిర్భయ’ కేసులో బాల నేరస్థుడిని - జువైల్ కోర్టులో విచారణ

Durga
ఢిల్లీ వైద్య విద్యార్ధిని 'నిర్భయ' అత్యాచారం కేసులో అరెస్టయి బాల నేరస్థుల జైలులో రిమాండులో ఉన్న  నిందితుడిపై అత్యాచారం, హత్య అభియోగాలపై విచారణ జరపాలని ఢిల్లీ జువనైల్ కోర్టు ఈ రోజు నిర్ణయించింది. కేసులో భాగంగా కొన్ని ఆధారాలను నివేదిక రూపంలో పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఆరవ వ్యక్తి అయిన ఈ నిందితుడికి కూడా నేరంలో ఐదుగురితో సమాన భాగస్వామ్యం వుందని అందులో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన కోర్టు ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. కాగా, తదుపరి వాదనలు తిరిగి మార్చి 6 నుంచి మొదలవనున్నాయి. నేరం రుజువైతే, ఈ నిందితుడికి గరిష్ఠంగా మూడు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: