పోసానికి ఫోన్ చేసి బండబూతులు తిడుతున్నాడు.. మెంటల్ ఎక్కించాడు..!

Chakravarthi Kalyan
పోసాని కృష్ణ మురళీ.. రైటర్ గా తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత నటుడుగా సత్తా చాటుతున్న కళాకారుడు. తన విచిత్ర ప్రవర్తన, హావభావాలతో త్వరలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన పెక్యులియర్ పర్సనాటీతో మెంటల్ కృష్ణ వంటి సినిమాలు కూడా తీశారంటే అతని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగానే నటనతో మెంటల్ ఎక్కిస్తాడంటారు. 

అలాంటి వెండితెర మెంటల్ కృష్ణకు ఓ వ్యక్తి నిజంగానే మెంటలెక్కించాడు.  నవీన్ అనే సదరు వ్యక్తి పోసానికి రోజూ ఫోన్లు చేసి వేధిస్తున్నాడట. సాధారణంగా అయితే ఇలాంటి వాటిని సెలబ్రెటీలు అంతగా పట్టించుకోరు.. మొదట్లో పోసాని కూడా అలాగే వదిలేశాడట. ఆ తర్వాత రాను రాను అతని ప్రవర్తన మరీ అభ్యంతరకరంగా తయారైందట. ఇంతకూ సదరు నవీన్ ఎందుకు పోసానిని వేధిస్తున్నాడు..

సాయం చేయలేనంటే తిట్లు, బండబూతులు, మెస్సేజీలు.. 



పోసాని సాధారణంగా టీవీల్లో వచ్చే కరుణాత్మక గాధలకు కరిగిపోయి ఎంతో కొంత మానవతాదృక్ఫథంలో సాయం చేస్తుంటాడు. ఈ నవీన్ అనే వ్యక్తికీ ఏవో ఆర్థిక సమస్యలున్నాయట. అందుకోసం కృష్ణ మురళీని ఆర్థిక సాయం అడిగాడట. పోసాని తాను ఇప్పుడు చేయలేనని చెప్పేశాడట. అప్పటి నుంచి పోసానికి ఫోన్ చేసి బండబూతులు తిడుతున్నాడట.

వేళ కాని వేళల్లో ఫోన్ చేసి బూతులు తిట్టడం, పేజీలకు పేజీలు బండబూతులతో మెస్సేజీలు పెట్టడం చేస్తున్నాడట. ఈ టార్చర్ తట్టుకోలేక పోసాని సదరు నవీన్ పై హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఎస్సార్ నగర్ పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఐతే.. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు.. ఏ సంబంధం లేకుండా డబ్బు ఎందుకు అడుగుతాడని మీడియా పోసానిని ప్రశ్నించడం.. ఏం సంబంధం లేదురా బాబూ.. అని పోసాని వాపోవడం ఆసక్తిరేపింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: