మంత్రి రావెల కొడుకుని చితకబాదిన స్థానికులు..

Chakravarthi Kalyan
ఆంధ్రా మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు.. తండ్రి పరువు బజారున పడేశాడు. ఇప్పటికే రాజధాని భూముల విషయంలో తలనొప్పులు ఎదుర్కొంటుంటే.. ఇప్పుడు ఈ లైంగిక వేధింపుల కేసుతో రావెల పరువు గంగలో కలిసింది. హైదరాబాద్ బంజారాహిల్స్  ప్రాంతంలో మంత్రి రావెల కిశోర్ బాబు కొడుకు సుశీల్.. తప్పతాగి రోడ్డున పోయే ఓ టీచర్ చేయి పట్టుకుని కారులోకి లాగాడట. 

ఒక్కసారిగా షాక్ కు గురైన ఆ ముస్లిం మహిళ బిత్తరపోయిందట. ఆ తర్వాత గట్టిగా ప్రతిఘటించిందట. ఈ రచ్చ చూసిన కొందరు స్థానికులు.. ఎవరో పోకిరీ వెధవ అనుకుని నడిరోడ్డుపై చితకబాదేశారట. సుశీల్ తో పాటు ఆయన కారు డ్రైవర్ ను కూడా స్థానికులు ఉతికి ఆరేశారట.. అయితే దెబ్బలు తట్టుకోలేక సుశీల్ కుమార్ వారి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశాడట.. 

కొందరు కుర్రాళ్లు సుశీల్ ను బైకులపై వెంబడించి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు అప్పజెప్పారట. బాధితురాలి వివరాలు చూస్తే... ఆమె పేరు ఫాతిమా బేగం. బంజారాహిల్స్ రోడ్‌నెం-13లోని అంబేద్కర్‌నగర్ బస్తీలో ఉంటుంది.. దగ్గర్లోని వింటేజ్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తోంది. విషయం తెలుసుకుని బాధితురాలి భర్త కూడా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

బాధితురాలి ఫాతిమా కథనం.. ఆమె మాటల్లోనే..  స్కూలు నుంచి వస్తూ ఇంటికెళ్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు కారులో నన్ను ఫాలో అయ్యారు. పీకల దాకా మద్యం తాగి ఇష్టానుసారంగా వ్యవహించారు. సుశీల్ అనే వ్యక్తి చేయి పట్టుకొని కారు ఎక్కాల్సిందిగా బలవంతపెట్టాడు. గట్టిగా అరచేశాను. స్థానికులు, బంధువులు వచ్చి కొట్టారు. మంత్రి కొడుకు కాబట్టి తప్పించే ప్రయత్నం చేద్దామనుకున్నా.. మీడియాలో ప్రముఖంగా రావడంతో కేసు పెట్టకతప్పలేదట పోలీసులకు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: