పోలవరం పై ’నవయుగ’ సంచలనం..జగన్ కు షాక్
పోలవరం రాజకీయం పీక్స్ కు
చేరుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రివర్స్ టెండర్ ప్రక్రియ కోసం
పనులను అర్ధాంతరంగా నిలిపేసిన విషయం తెలిసిందే. పనులను హఠాత్తుగా నిలిపేయటంతో అప్పటి
వరకూ పనులను చేసిన నవయుగ కంపెనీ ప్రిస్టేజ్ ఫీలైంది. దాంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తు హై
కోర్టులో కేసు వేసింది. పనులనుండి తమను తప్పించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి
లేదంటూ వాదిస్తోంది.
సిఎం నిర్ణయంతో తమ సంస్ధకు ఆర్దికంగా నష్టం జరగటమే కాకుండా ప్రతిష్ట కూడా దెబ్బతింటోందంటూ మండిపోయింది. కాబట్టి పనులను ఇతర సంస్ధలు కాకుండా తామే చేపట్టేందుకు వీలుగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతు నవయుగ కోర్టును అభ్యర్ధించింది. ఇది స్ధూలంగా నవయుగ కంపెనీ కోర్టులో వేసిన కేసు సారంశం.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నవయుగ కంపెనీకి చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలిసిందే. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును చంద్రబాబు నామినేషన్ పై అప్పగించారంటేనే అర్ధమైపోతోంది వాళ్ళ బంధం. జగన్ చెప్పినట్లుగా ప్రాజెక్టు పనుల్లో భారీగానే అవినీతి జరిగి ఉండచ్చు. కానీ దాన్ని నిరూపించటం అంత సులభం కాదన్న విషయం జగన్ గ్రహించాలి. ఇటువంటి వ్యవహారాలు నడపటంలో చంద్రబాబు ఆరితేరిపోయారు.
కోర్టులో నవయుగ కంపెనీ కేసు వేయటం వెనుక చంద్రబాబు పాత్ర కూడా ఉండచ్చు. కోర్టులో కేసు వల్ల జగన్ రివర్స్ టెండరింగ్ ఆలోచనలు ముందుకు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయనటంలో సందేహం లేదు. అసలే కేంద్రం, పోలవరం అథారిటి కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళని కాదని జగన్ ముందుకు వెళ్ళాలని అనుకున్నారు. కానీ ఇపుడు బంతి కోర్టులో పడటంతో తనిష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకునేందుకు జగన్ కు అవకాశాలు లేవు. తాజాగా కేసు వల్ల జరగబోయేదేమిటంటే పోలవరం పనుల్లో జాప్యం, వ్యయాలు పెరిగిపోవటం అంతే.