అఖిలప్రియ రెడ్‌ బుక్‌..ఈ 100 మందే టార్గెట్‌..?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ప్రస్తుతం రెడ్ బుక్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఏ రాజకీయ నాయకున్ని కదిలించిన రెడ్ బుక్కు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా తెలుగుదేశం మంత్రి  నారా లోకేష్ ఎన్నికల కంటే ముందు ఈ రెడ్బుక్ కల్చర్ తీసుకువచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో.. తన కుటుంబాన్ని అలాగే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టిన నాయకులను ఎవరిని వదిలిపెట్టనని.. అందరి పేర్లు రెడ్ బుక్కులో రాశానని ఈ ప్రకటించారు నారా లోకేష్.

అయితే ముందుగా నారా లోకేష్ చెప్పినట్లుగానే రెడ్బుక్ లో చాలామంది పేర్లు రాసుకొని మరి...  తెలుగుదేశం ప్రభుత్వం టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నారా లోకేష్ బాటలోనే తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది నడుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. భూమా అఖిల ప్రియ కూడా... ఓ కొత్త రెడ్బుక్ మైంటైన్ చేస్తోంది. ఈ మేరకు తాజాగా తన రెండు పై సంచలన వ్యాఖ్యలు చేశారు భూమా అఖిల ప్రియ.
నంద్యాలలో  భూమా అఖిల హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. తనకు కూడా రెడ్ బుక్ ఉందని తెలిపారు. ఆ రెడ్‌ బుక్‌ లో ఏకంగా 100 మందికి పైగా ఉన్నారని బాంబ్‌ పేల్చారు ఎవరిని వదలను అంటూ హెచ్చరించారు భూమా అఖిల ప్రియ. అంటే వారిని ఏదో నేను చంపేస్తానని కాదు ఖచ్చితమైన ఆధారాలతో వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వివరించారు భూమా అఖిల ప్రియ. మాజీ ఎమ్మెల్యే గంగుల డిగ్రీ కాలేజీ తెచ్చానని చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు.

పేరుకే డిగ్రీ కాలేజ్ కానీ సరైన వసతులు కూడా లేవని ఆగ్రహించారు భూమా అఖిల ప్రియ. కనీసం స్వీపర్లు కూడా లేక విద్యార్థులతో గదులు శుభ్రం చేపిస్తున్నారని మండిపడడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గంగుల విజయేంద్ర రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేదని చురకలు అంటించారు భూమా అఖిల ప్రియ. అతను కేవలం దొంగ ఓటర్ మాత్రమేనని బాంబ్‌ పేల్చారు భూమా అఖిల ప్రియ.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: