ఏపీ: ఎక్కడ కనిపించని వైసిపి మహిళా నేత.. కారణం..?

Divya
వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముందు ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గురించి చెప్పాల్సిన పనిలేదు.. అటు వైసిపి పార్టీని కానీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కానీ ఏమన్నా అన్నారంటే చాలు ఎన్నోసార్లు మీడియాలో తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తూ ఉంటుంది రోజా. మినిస్టర్ అయ్యాక ప్రజలలో నిత్యం ఉన్నప్పటికీ పర్యటక శాఖ మంత్రిగా కూడా బాగానే హడావిడి చేసింది 2024 ఎన్నికలలో గెలుపు ధీమాతో ఉన్నప్పటికీ.. చాలా మంది వైసిపి నేతలే ఈమెకు ఎగైనెస్ట్ గా తన నియోజకవర్గంలోనే ప్రచారం చేశారు.

దీంతో రోజా ఓడిపోవడం కూడా జరిగింది. గతంలో ప్రతిపక్ష పార్టీల పైనా రెచ్చిపోయి మాట్లాడిన రోజు ఇప్పుడు సైలెంట్ గా అవ్వడంతో అసలు ఈమధ్య ఎక్కడ కనిపించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం తిరుపతిలో కనిపించిన రోజా మరి ఆ తర్వాత ఎక్కడా కూడా కనిపించలేదు. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని చిన్నవాటికి పెద్దవాటి పై స్పందించిన రోజు ఇప్పుడు ఎలాంటి మాటలు కూడా మాట్లాడడం లేదా అంటూ పలువురు కార్యకర్తలు కూడా వాపోతున్నారు. అయితే నగరి ప్రజలు కూడా వైసిపి పార్టీలో రోజా ఓడిపోవడం వెనకే ఈమె సైలెంట్ కి గల కారణం అన్నట్లుగా ఆలోచిస్తున్నారు.

అయితే గత కొద్ది రోజుల నుంచి పార్టీ మారుతోంది రోజా అనే విధంగా వార్తలు వినిపించినప్పటికీ ఆమె వాటిపైన కౌంటర్ కూడా వేయడం జరిగింది. తాను ఎప్పటికీ కూడా వైసిపి పార్టీలోనే కొనసాగుతానని తెలియజేసింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు యాక్టివ్ గా ఉంటూ కొన్ని వాటిపైన స్పందిస్తూ ఉంటుంది రోజా.. మరి 2029 ఎన్నికలకు రోజా సిద్ధమవుతుందా లేకపోతే మళ్లీ బుల్లితెర పైన ప్రసారమయ్యేటువంటి కార్యక్రమాలకు జడ్జిగా వస్తుందా అనే విషయం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: