ఏపీ అసెంబ్లీ: చంద్రబాబులా జగన్ ను ఏడిపించడమే టీడీపీ టార్గెట్?

Veldandi Saikiran
* అసెంబ్లీలో గతంలో చంద్రబాబుకు అవమానం 

* చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో ఆడుకున్న వైసిపి
* వైసిపి పాలసీని  అమలు చేయబోతున్న టిడిపి  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈనెల 22వ తేదీ నుంచి అంటే సోమవారం రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. పది రోజుల కిందట. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణస్వీకారం చేశారు. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలలో... ఓట్ ఆన్ అకౌంట్  బడ్జెట్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
అలాగే ఏపీలో జరుగుతున్న.. రాజకీయ పరిణామాలు, వైసిపి పాలనలో జరిగిన అవకతవకలపై చర్చ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించిన  విధానాలపై శ్వేత పత్రాలను  చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ సందర్భంగా... వైసీపీ పాలనలో.. జరిగిన అవినీతిని కూడా  ఎండగట్ట నుండి ఈ కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ఏపీ ప్రజలకు జరిగిన ప్రతి అన్యాయాన్ని కూడా ప్రశ్నించే ఛాన్స్ ఉంది.
 అయితే.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలను...  అసెంబ్లీలో దారుణంగా టీజింగ్ చేసేవారు. చంద్రబాబు కుటుంబం పై అత్యంత దారుణంగా.. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కామెంట్స్ చేశారు. దీంతో చంద్రబాబు నాయుడు గతంలో.. ఏడ్చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతానని.. శపథం చేసి మరి.. రీ ఎంట్రీ ఇచ్చారు బాబు.
 ఇక దీనిపై ప్రతికాలం తీర్చుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం... ఈ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలోనే.. స్కెచ్ వేస్తోందట. చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండి... అచ్చం నాయుడు, నారా లోకేష్, అనిత, లాంటి కీలక నేతలతో... జగన్మోహన్ రెడ్డి పర్సనల్ విషయాలను.. ఆయన కుటుంబం గురించి.. సెటైర్లు పేల్చేలా స్కెచ్ వేస్తూ ఉందట. చంద్రబాబు లాగానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏడ్చేలా.. ప్లాన్ వేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: